బాలయ్య గోడును పట్టించుకోని పోలీసులు

హిందుపురం ఎమ్మెల్యే, నటుడు నందమూరి బాలకృష్ణకు తాజాగా చేదు అనుభవం ఎదురైన ఘటన గురించి తెలిసిందే.తన నియోజకవర్గంలో ఓ వేడుకకు హాజరయ్యేందుకు హిందుపురం వెళ్లిన బాలయ్యను దారిమధ్యలో కొందరు గ్రామస్థులు అడ్డుకొని నిరసన వ్యక్తం చేశారు.

 Balakrishna Requested For Security But In Vain-TeluguStop.com

కాగా ఈ ఘటనను ముందే ఊహించిన బాలయ్య తనకు సెక్యురిటీ కావాలంటూ పోలీసు వారిని కోరాడట.తనకు ఎస్కోర్ట్ వాహనం అందించాల్సిందిగా అధికారులను కోరాడట బాలయ్య.

కానీ తన గోడును ఎవరూ పట్టించుకోలేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.తన నియోజకవర్గంలో కొంతమేర తనకు వ్యతిరేకత ఉన్న ప్రజలు ఉన్నారని.

వారి నుండి తనకు హాని జరుగవచ్చని బాలయ్య వేడుకున్నారట.

అయినా పోలీసులు ఆయన గోడును పెడచెవిన పెట్టడంతోనే కొందరు గ్రామస్తులు ఆయన్ను దారి మధ్యలో అడ్డగించి నానా హంగామా చేశారని బాలయ్య వర్గీయులు అంటున్నారు.

ఏదేమైనా తన గోడును ఏపీ ప్రభుత్వ అధికారులు కావాలనే పట్టించుకోలేదని బాలయ్య అన్నట్లు తెలుస్తోంది.ప్రస్తుతం బాలయ్యను దారిమధ్యలో అడ్డుకున్న విషయం రాష్ట్రం మొత్తం హాట్ టాపిక్‌గా మారడం గమనార్హం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube