నల్లగొండ జిల్లా హుజూర్ నగర్ అసెంబ్లీ స్థానంకు బై పోల్స్ జరుగబోతున్న విషయం తెల్సిందే.గత ఏడాది చివర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఈ స్థానం నుండి ఉత్తమ్ గెలుపొందగా ఆయన ఇటీవల ఎంపీగా పోటీ చేసి గెలుపొందాడు.
దాంతో ఆయన ఎమ్మెల్యేగా రాజీనామా చేయడం జరిగింది.ఎమ్మెల్యేగా రాజీనామా చేసిన ఆ స్థానంకు ఉప ఎన్నికలు వచ్చాయి.
గత ఎన్నికల్లో టీఆర్ఎస్ తరపున శానంపూడి సైదిరెడ్డి ఎన్నికల్లో పోటీ చేయడం జరిగింది.ఆ ఎన్నికల్లో శానంపైడి సైడిరెడ్డి కొద్ది తేడాతో ఓటమి పాలయ్యాడు.
ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి హుజూర్ నగర్లో తన భార్య పద్మను నిలబెట్టే అవకాశం ఉంది.ఇక టీఆర్ఎస్ తరపున ఖచ్చితంగా మళ్లీ శానంపూడి సైదిరెడ్డి పోటీ చేయబోతున్నట్లుగా క్లారిటీ వచ్చింది.
తాజాగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ హుజూర్నగర్లో ఈసారి ఖచ్చితంగా విజయం టీఆర్ఎస్దే అంటూ నమ్మకం వ్యక్తం చేశాడు.హుజూర్ నగర్ నుండి కాంగ్రెస్ను తరిమి కొట్టేదుకు ఈసారి అక్కడి ప్రజలు చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్లుగా కేటీఆర్ నమ్మకం వ్యక్తం చేశాడు.
హుజూర్ నగర్కు టీఆర్ఎస్ చేసిన అభివృద్ది ఈసారి శానంపూడిని గెలిపిస్తుందని స్థానిక పార్టీ నాయకులు కూడా అంటున్నారు.