డ్రగ్స్ ఓవర్‌డోస్.. ముగ్గురు మృతి, నలుగురి పరిస్థితి విషమం

డ్రగ్స్ ఓవర్‌డోస్ కారణంగా పీట్స్‌బర్గ్‌లో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు.

నగరంలోని సౌత్‌సైడ్ అపార్ట్‌మెంట్స్‌లో కొందరు వ్యక్తులు స్పృహ తప్పి పడివున్నారని పోలీస్ వర్గాలకు ఆదివారం అర్ధరాత్రి సమాచారం అందింది.

వెంటనే ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు ఒక అపార్ట్‌మెంట్ వద్ద ఐదుగురిని, ఎలివేటర్ మరియు వీధి చివరన మరో ఇద్దరిని గుర్తించి మెర్సీ హాస్పిటల్‌కు తరలించారు.వీరిలో ముగ్గురు మరణించగా.

నలుగురు ఆసుపత్రిలో అత్యంత విషమ పరిస్ధితుల్లో ఉన్నారు.

  మరోవైపు వీరు డ్రగ్స్ తీసుకున్నారనడానికి శరీరంపై ఎలాంటి సూది గుర్తులు లేవు.వీరంతా ఒక ఈవెంట్‌కు హాజరై అక్కడ మోతాదుకు మించి మాదకద్రవ్యాలు సేవించి ఉండవచ్చని భావిస్తున్నారు.వారి మణికట్టులకు ఉన్న ఆరెంజ్ కలర్ బ్యాడ్జిల ఆధారంగా బాధితులు ఎక్కడికి వెళ్లారనే దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు.

Advertisement

మరోవైపు కొత్త కొత్త మాదక ద్రవ్యాలను పరిమితికి మించి సేవించరాదంటూ పీట్స్‌బర్గ్ పోలీసులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు.ఈ ఘటన కారణంగా ఆ ప్రాంతంలోని స్ధానికులు భయాందోళనలకు గురయ్యారు.

పాకిస్థానీ మహిళను ఉద్యోగం నుంచి తీసేసిన టెస్లా.. ఆ షాక్‌తో..??
Advertisement

తాజా వార్తలు