శంకర్ తో తనని పోల్చొద్దు అంటున్న సాహో డైరెక్టర్

సాహో సినిమాతో ఒక్కసారిగా స్టార్ డైరెక్టర్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న యువ దర్శకుడు సుజిత్.

మొదటి సినిమా రన్ రాజా రన్ తో బ్లాక్ బస్టర్ కొట్టి రెండో సినిమానే ప్రభాస్ తో చేసే అవకాశాన్ని సొంతం చేసుకున్న సుజిత్ ఊహించని విధంగా ఏకంగా బాహుబలి తర్వాత టాలీవుడ్ ఇండస్ట్రీలో మరో బిగ్గెస్ట్ బడ్జెట్ మూవీని డైరెక్ట్ చేసే అవకాశాన్ని సొంతం చేసుకున్నాడు.

అలా సాహో సినిమాని హాలీవుడ్ స్టాండర్స్ లో తెరకెక్కించి ఈ నెలలో రిలీజ్ కి రెడీ చేసాడు.ఈ నేపథ్యంలో ఇప్పటికే చిత్ర యూనిట్ సినిమా సాంగ్ ప్రోమో లను వరుసగా రిలీజ్ చేస్తుంది.

మరోవైపు తాజాగా సినిమా ప్రమోషన్ మీద కూడా దృష్టి పెట్టినట్లు తెలుస్తుంది.తాజాగా సాహో సినిమా నుంచి ఓ సాంగ్ ప్రోమోని రిలీజ్ చేశారు.

ఈ సందర్భంగా దర్శకుడు సుజిత్ మొదటిసారి మీడియాతో సాహో సినిమా విశేషాలు పంచుకున్నాడు.సాహో సినిమాలో ఏ చోట నువ్వున్నా అనే పాటను ఆస్ట్రియాలో అద్భుతమైన లొకేషన్స్ లో మేకింగ్ విజువల్ గా ఆవిష్కరించారు.

Advertisement

ఈ సాంగ్ చూసి అందరూ దర్శక దిగ్గజం శంకర్ మేకింగ్ స్టైల్ లో సాంగ్ ఉందని ప్రశంసించారు.ఇదే విషయాన్ని సుజిత్ దగ్గర మీడియా ప్రతినిధులు ప్రస్తావించగా తనని దర్శకుడు శంకర్ తో పోల్చవద్దని ఆ స్థాయికి తాను ఇంకా వెళ్లలేదని చెప్పుకొచ్చాడు.

వాళ్లు ఎక్కడో ఆకాశంలో ఉన్నారని, ఆ స్థాయిలో పాటలు చిత్రీకరించారని ప్రశంస దక్కడం నిజంగా తనకి దక్కిన గొప్ప గౌరవంగా భావిస్తానని సుజిత్ చెప్పడం విశేషం.అలాగే సాహో సినిమా స్క్రిప్ట్ ని బాహుబలి తర్వాత మార్చలేదని, అప్పుడు ఏదైతే ఉందో అదే స్క్రిప్ట్ తో షూటింగ్ కి వెళ్లామని చెప్పాడు.

అలాగే సినిమాలో ఒక్కో సంగీత దర్శకుడుతో ఒక్కో సాంగ్ చేయించడంలో ప్రత్యేకత ఏమీ లేదని గతంలో చాలా మంది దర్శకులు చేసిన విధంగానే తాను చేసానని చెప్పుకొచ్చారు.కేవలం కొత్తదనం కోసమే అలా ట్రై చేసినట్లు చెప్పాడు.

సొంత ఇంటి కల నెరవేర్చుకున్న బిగ్ బాస్ బ్యూటీ శోభ.. ఫోటోలు వైరల్!
Advertisement

తాజా వార్తలు