సమాజంలో కొందరిని చూస్తుంటే ఒళ్ళు మండిపోయేంత కోపం వస్తుంది.వారిని ఏం చేసినా కూడా పాపం అనిపించదు.
తాజాగా వెలుగు చూసిన విషయం సభ్య సమాజం తల దించుకునే విధంగా ధారుణంగా ఉంది.కోల్ కత్త లో జరిగిన ఈ విషయం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.దాంతో పోలీసులు రంగంలోకి దిగి వారిని అరెస్ట్ కూడా చేశారు.16 కుక్క పిల్లలను చంపిన వీరిని సమాజం నుండి బహిస్కరించాలంటు సోషల్ మీడియాలో జనాలు డిమాండ్ చేస్తున్నారు.
పూర్తి వివరాల్లోకి వెళ్తే.కోల్ కత్తా ఎన్ఆర్ఎస్ మెడికల్ కాలేజ్ వెనుక వైపున ఈ దారుణ సంఘటన జరిగింది.హాస్టల్ కు చెందిన ఇద్దరు అమ్మాయిలు ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 16 కుక్క పిల్లలను చంపేశారు.
అవును వాటితో ఆడుతూ మరి చంపేయడం కొందరు చూసి తమ ఫోన్ లో బంధించారు.కాలేజ్ లో ఉన్న కుక్క ఈ పిల్లలకు జన్మనిచ్చిందట.అయితే కుక్క పిల్లలను సాకడం ఇబ్బందిగా ఉండటం లో వాటిని హాస్టల్ అమ్మాయిలు చంపేయాలని నిర్ణయించుకుని ఈ పని చేసినట్లుగా స్టానికుల ద్యారా తెలుస్తోంది.
విషయం తెలుసుకున్న పోలీసులు ఎంకౌరి మొదలు పెట్టినట్లుగా తెలుస్తోంది.ఆ కుక్క పిల్లలను చంపినట్లుగా వీడియో సాక్ష్యం ఉండటం తో వారు తప్పించుకోలేక పోయారు.ఇలాంటి నీచానికి పాల్పడ్డ వీరికి ఎలాంటి శిక్ష పడుతుందో అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.