కర్నూల్ జిల్లా బాలుడికి అమెరికా పోలీసులు అవార్డు ఇచ్చారు.అమెరికా పోలీసులు ఏంటి.
కర్నూల్ బాలుడికి అవార్డు ఇవ్వడం ఏమిటి అనుకుంటున్నారా.అసలు విషయం ఏమిటంటే.
కర్నూల్ జిల్లాకి చెందిన దంపతులు ఇద్దరు ఉద్యోగ రీత్యా మూడేళ్ళ క్రితం అమెరికా వెళ్ళారు.అమెరికాలోని ఈగన్ ప్రాంతంలో ఆక్వా టాట్స్ ప్రాంతంలో ఉంటున్నారు.అయితే తాము ఉంటున్న అపార్ట్మెంట్లోకి

వారిని చూసేందుకు డిసెంబర్ లో శ్రీనివాస ఆర్.ఎల్లావర్తి అనే 34 ఏళ్ల వ్యక్తి వచ్చాడు.అక్కడే ఉన్న ఇండోర్ స్విమ్మింగ్పూల్లో గత డిసెంబర్ 31న దూకేశాడు.అయితే ఈత రాకపోవడం వలన మునిగిపోతున్న అతడిని చూసిన రఘు నటరాజ్ 11 ఏళ్ల కుమారుడు అద్వైక్ ఎన్.
విశ్వామిత్ర తానూ స్విమ్మింగ్ పూల్ లోకి దూకి మునిగిపోతున్న శ్రీనివాస్ ని బయటకి తీసుకువచ్చాడు.

అయితే ఈ విషయంపై ఆనోటా ఈనోటా తెలిసి ఆ బాలుడిపై ప్రశంసల వర్షం కురిసింది.దాంతో అతడి సాహసానికి మెచ్చిన పోలీసులుఆ బాలుడికి లైఫ్ సేవింగ్ అవార్డు ఇచ్చి సత్కరించారు.







