అన్నయ్య స్నేహితుడే కదా! అని నమ్మిన ఆ 20 ఏళ్ల ఇంజనీరింగ్ విద్యార్థి కి తీరని శోకాన్ని మిగిల్చాడు.రెండు రోజుల పాటు ఓ గదిలో బంధించి నరకం చూపించారు.
మృగాళ్లలా ఆ యువతిని అతికిరాతకంగా చెరచటంతో బాధితురాలు ప్రాణపాయస్థితిలో కొట్టుమిట్టాడుతోంది.తమ వాంఛను తీర్చుకున్న దుండగులు బాధితురాలిని నిర్మానుష్య ప్రాంతంలో పడేశారు.
ఒడిశా రాష్ట్రంలోని రూర్కెలా లో ఈ ఘటన చోటుచేసుకుంది.వివరాల లోకి వెళ్తే
20 ఏళ్ల ఇంజనీరింగ్ విద్యార్థిని పోయిన డిసెంబర్ 30న ఇంటికెళ్లడానికి రైల్వే స్టేషన్కు చేరింది.రైలు కోసం వేచి చూస్తున్న క్రమంలో ఆ యువతి దగ్గరకు ఆమె అన్నయ్య స్నేహితుడు వచ్చాడు.ఆమెకు మాయ మాటలు చెప్పి.
తాను వెళ్లాల్సిన ట్రైన్ కాకుండా.మరో ట్రైన్ ఎక్కించాడు.
కొద్ది సేపటికి ఆ యువతి.తాను సరైన ట్రైన్ ఎక్కలేదనే విషయాన్ని గ్రహించింది.
వెంటనే ఆ యువకుడిని నిలదీయడంతో.వచ్చే స్టేషన్.
లోథ్పూర్లో దిగుదామన్నాడు.అక్కడి నుంచి బస్సులుంటాయని యువతిని నమ్మించాడు.
లోథ్పూర్లోని రైల్వేస్టేషన్లో దిగగానే ఓ ఇంటికి తీసుకెళ్లి తనతో పాటు మరో ఐదుగురితో కలిసి రెండు రోజుల పాటు అత్యాచారానికి పాల్పడ్డాడు.అనంతరం నిర్మానుష్య ప్రాంతంలో వదిలేయడంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది.బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.