అన్నయ స్నేహితుడే కదా అని నమ్మివెళ్ళింది ఆ 20 ఏళ్ల యువతి.! చివరికి ఆరుమంది మృగాల్లాగా..!
TeluguStop.com
అన్నయ్య స్నేహితుడే కదా! అని నమ్మిన ఆ 20 ఏళ్ల ఇంజనీరింగ్ విద్యార్థి కి తీరని శోకాన్ని మిగిల్చాడు.
రెండు రోజుల పాటు ఓ గదిలో బంధించి నరకం చూపించారు.మృగాళ్లలా ఆ యువతిని అతికిరాతకంగా చెరచటంతో బాధితురాలు ప్రాణపాయస్థితిలో కొట్టుమిట్టాడుతోంది.
తమ వాంఛను తీర్చుకున్న దుండగులు బాధితురాలిని నిర్మానుష్య ప్రాంతంలో పడేశారు.ఒడిశా రాష్ట్రంలోని రూర్కెలా లో ఈ ఘటన చోటుచేసుకుంది.
వివరాల లోకి వెళ్తే Style="margin:auto;width: 80%;text-align:center;margin-bottom: 10px;""/"/
20 ఏళ్ల ఇంజనీరింగ్ విద్యార్థిని పోయిన డిసెంబర్ 30న ఇంటికెళ్లడానికి రైల్వే స్టేషన్కు చేరింది.
రైలు కోసం వేచి చూస్తున్న క్రమంలో ఆ యువతి దగ్గరకు ఆమె అన్నయ్య స్నేహితుడు వచ్చాడు.
ఆమెకు మాయ మాటలు చెప్పి.తాను వెళ్లాల్సిన ట్రైన్ కాకుండా.
మరో ట్రైన్ ఎక్కించాడు.కొద్ది సేపటికి ఆ యువతి.
తాను సరైన ట్రైన్ ఎక్కలేదనే విషయాన్ని గ్రహించింది.వెంటనే ఆ యువకుడిని నిలదీయడంతో.
వచ్చే స్టేషన్.లోథ్పూర్లో దిగుదామన్నాడు.
అక్కడి నుంచి బస్సులుంటాయని యువతిని నమ్మించాడు. Style="margin:auto;width: 80%;text-align:center;margin-bottom: 10px;""/"/
లోథ్పూర్లోని రైల్వేస్టేషన్లో దిగగానే ఓ ఇంటికి తీసుకెళ్లి తనతో పాటు మరో ఐదుగురితో కలిసి రెండు రోజుల పాటు అత్యాచారానికి పాల్పడ్డాడు.
అనంతరం నిర్మానుష్య ప్రాంతంలో వదిలేయడంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది.బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
High Roller Tipps & Casino-Chat-Etikette: Vergleichsanalyse Für Erfahrene Spieler In Deutschland