పవన్ సభకు 'పవర్' కట్ ! కారణం ఆయనేనా ..?

తూర్పుగోదావరి జిల్లాలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రజాపోరాట యాత్ర మొదలుపెట్టాడు.ఈ పోరాటయాత్ర సభకు అభిమానులు, కార్యకర్తలు పోటెత్తారు.

సభాస్థలి జనాలతో కిక్కిరిసి కనిపిస్తుంటే కత్తిపూడిలో విద్యుత్ ప్రసారం ఆగిపోయింది.అయితే సభ ప్రసారాలను ప్రజలు టీవీలలో వీక్షించకుండా ఆపేందుకే విద్యుత్ ప్రసారాలను ఆపేశారని జనసేన కార్యకర్తలు ఆరోపిస్తున్నారు.

ఇలాంటి బ్లాక్ మెయిల్ రాజకీయాలతో పవన్ ప్రభంజనాన్ని ఆపలేరని.ఇలాంటి చర్యలు మానుకోవాలని కార్యకర్తలు ఆరోపించారు.మరికొంతమంది మాత్రం సీఎం చంద్రబాబు నాయుడుకి పవన్ అంటే భయం వేస్తోంది అందుకే పవర్ కట్ చేయించి కక్షపూరిత చర్యలకు దిగాడని తొందర్లోనే అయన పవర్ కట్ అవ్వడం ఖాయం అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

కడప ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్ రెడ్డి పై సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు..!!
Advertisement

తాజా వార్తలు