ఎకచత్రాధిపత్యంలా మొబైల్ ఇంటర్నెట్ మార్కెట్ ఏలుతున్న రిలయన్స్ జియోని గద్దె దింపేందుకు పూనుకున్నాయి ఇతర మొబైల్ ఆపరేటింగ్ కంపెనీలు.ఒకరి తరువాత ఒకరు, ఒకరిని మించి మరొకరు .
తమ వినియోగదారుల కోసం ఆకర్షణీయమైన ప్లాన్స్ ప్రకటిస్తున్నారు.మొన్నే ప్రభుత్వ కంపెని బిఎస్ఎన్ఎల్ చౌకా ప్యాక్ అంటూ 444 రూపాయలకే మూడు నెలలపాటు రోజుకి 4GB అంటూ సెన్సేషనల్ ప్యాక్ ని ప్రవేశపెట్టింది.
ప్రస్తుతం మార్కెట్ లో ఉన్న అత్యంత చవక నెట్ ప్యాక్ ఇదే.జియో కూడా దీని ముందు దండగే.ఇక జియో కన్నా మరో చీప్ ప్యాక్ ని ప్రవేశపెట్టింది వోడాఫోన్.ఇది మరీ బిఎస్ఎన్ఎల్ అంత లాభాకరంగా లేదు కాని, అత్యవసర పరిస్థితుల్లో మాత్రం బాగా పనికివస్తుంది.
కేవలం 29 రూపాయలతో రీఛార్జీ చేసుకోండి చాలు.5 గంటల పాటు మీకు అన్ లిమిటెడ్ ఇంటర్నెట్ వస్తుంది.అది కూడా 3G/4G , మీ ఫోన్ దేనికి సపోర్ట్ చేస్తే ఆ నెట్వర్క్ లో వాడుకోవచ్చు.5 గంటలపాటు ఎటువంటి డేటా లిమిట్ లేదు.అంటే మీరు గంట అన్ లిమిటెడ్ నెట్ కి కేవలం 6 రూపాయలు చెల్లిస్తున్నట్లు.వాడుకున్నవాళ్ళకి వాడుకున్నంత మాట.అయితే ఇందులో ఓ ట్విస్టు ఉంది.ఎదో ఒక మతలబు పెట్టకుండా ఏ కంపెని మాత్రం ఇలాంటి ఆఫర్ ఇస్తుంది చెప్పండి.
ఇది కేవలం రాత్రుళ్ళు పనిచేసే ఆఫర్.
ఈ ప్యాక్ పేరే వోడాఫోన్ సూపర్ నైట్.
అంటే రాత్రి 1 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకే ఈ ప్యాక్ పనిచేస్తుంది అన్నమాట.రాత్రుళ్ళు గడిపే మహానగరాల జీవులకి ఇది సరిగ్గా సూట్ అయ్యే ఆఫర్.
పైగా ప్రీ పెయిడ్ కస్టమర్లకె ఇస్తున్నాడు.అయితే ఈ ఆఫర్ మీద రీచార్జ్ చేసుకోవాలంటే ముందుగా మీ నంబర్ నుంచి *444*4# కి dail చేసి మీ నంబర్ ని ఈ ప్యాక్ కోసం రిజిస్టర్ చేయించుకోవాలి.
అప్పుడే మీరు చేసుకునే రీచార్జ్ పనిచేస్తుంది.