సాధారణంగా పెళ్లికి ముందు దాదాపు అందరి అమ్మాయిల చర్మం కాంతివంతంగా మెరిసిపోతుంటుంది.కానీ, పెళ్లి తర్వాత ముఖంలో ముందు ఉన్నంత కళను చాలా మంది కొనసాగించడంలో విఫలం అవుతుంటారు.
చర్మ సంరక్షణకు సరిగ్గా సమయం దొరక్కపోవడం, ప్రెగ్నెన్సీ, పలు రకాల మందుల వాడకం, ఆహారపు అలవాట్లు, వివాహం తర్వాత లైఫ్లో వచ్చే మార్పులు, ఒత్తిడి వంటివి ఇందుకు ప్రధాన కారణాలు అవుతుంటాయి.కారణం ఏదైనా పెళ్లికి ముందు మాదిరిగానే.
ఆ తర్వాత కూడా మెరిసిపోవాలని భావిస్తే అందుకు ఇప్పుడు చెప్పబోయే సింపుల్ రెమెడీ అద్భుతంగా సహాయపడుతుంది.మరి లేటెందుకు ఆ రెమెడీ ఏంటో.
ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం పదండీ.
ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని గ్లాస్ వాటర్ పోయాలి.
వాటర్ కాస్త హీట్ అవ్వగానే అందులో మూడు అనాస పువ్వులు, రెండు టేబుల్ స్పూన్ల అవిసె గింజలు, వన్ టేబుల్ స్పూన్ బియ్యం వేసుకుని పది నుంచి పదిహేను నిమిషాల పాటు ఉడికించాలి.ఇలా చేస్తే వాటర్ జెల్లీ ఫామ్లోకి మారుతుంది.
అప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఉడికించుకున్న మిశ్రమాన్ని చల్లారబెట్టుకోవాలి.
పూర్తిగా కూల్ అయిన వెంటనే పల్చటి వస్త్రం సాయంతో ఉడికించుకున్న మిశ్రమం నుంచి జెల్ను సపరేట్ చేసుకోవాలి.
ఇప్పుడు ఈ జెల్లో వన్ టేబుల్ స్పూన్ ఆల్మండ్ ఆయిల్, హాఫ్ టేబుల్ స్పూన్ విటమిన్ ఇ ఆయిల్ వేసుకుని బాగా కలుపుకోవాలి.ఆపై ఈ జెల్ను ఏదైనా బాక్స్లో నింపి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే పది రోజుల పాటు వాడుకోవచ్చు.
ఇక దీనిని ఎలా యూస్ చేయాలంటే.రాత్రి నిద్రించే ముందు ముఖానికి ఉన్న మేకప్ మొత్తాన్ని రిమూవ్ చేసి వాటర్తో ఫేస్ వాష్ చేసుకోవాలి.అనంతరం తయారు చేసుకున్న జెల్ను ముఖంపై అప్లై చేసి సున్నితంగా రెండు నిమిషాల పాటు మసాజ్ చేసుకుని పడుకోవాలి.ఇలా రెగ్యులర్గా చేస్తే ముఖం వైట్గా, బ్రైట్గా మెరిసిపోతుంది.
వృద్ధాప్య ఛాయలు త్వరగా రాకుండా ఉంటాయి.మరియు చర్మంపై ఏమైనా మచ్చలు ఉన్నా తొలగిపోతాయి.