సినిమా ఇండస్ట్రీలో సెంటిమెంట్లు, నమ్మకాలు ఫాలో చేయనివారిని దొరకబట్టడం కష్టం.అందరికీ ఏదో ఒక సెంటిమెంటు ఉంటుంది.
అలా సెంటిమెంట్లని పట్టించుకునేవారిలో మహేష్ బాబు కూడా ఉన్నాడు.ఈ సూపర్ స్టార్ తన సినిమా ఓపెనింగ్ కి వెళ్ళడు.
తన ఏ కొత్త సినిమా ప్రారంభమైనా, ఆ సినిమా పూజ కార్యక్రమానికి వెళ్ళే అలావాటు మహేష్ కి లేదు.
జులైలో ప్రారంభమైన తన 23వ సినిమా పూజకి మురుగదాస్ ఆండ్ టీమ్, మహేష్ తరఫున మహేష్ భార్య నమ్రత వెళ్ళింది.
ఈరోజు కూడా అంతే.తన 24వ సినిమా ఓపెనింగ్ జరిగితే, హైదరాబాద్ లోనే ఉన్న మహేష్ ముహూర్తానికి వెళ్ళలేదు.
ఎప్పటిలాగే తన సతీమణి నమ్రత వెళ్ళింది.దర్శకుడు కొరటాల శివతో పాటు సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్, సినిమాటోగ్రాఫర్ కే.రవిచంద్రన్, నిర్మాత దానయ్య, ఇతర యూనిట్ సభ్యులు హాజరయ్యారు.
ఇంకా ఈ సినిమాలో హీరోయిన్ గా ఎవరిని అనుకోలేదట.
ప్రస్తుతానికైతే ఫిబ్రవరిలో సినిమా షూటింగ్ ప్రారంభించి, వచ్చే ఏడాది సెప్టెంబరులో సినిమా విడుదల చేసే ఆలోచనలో ఉన్నారు.







