సూపర్ స్టార్ రజినీకాంత్ త్వరలోనే కబాలిగా మనముందుకి రాబోతున్నారు.పీ.
ఏ రంజీత్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో రాధిక ఆప్టే కథానాయికగా నటించింది.రజినీకాంత్ సినిమాలకు సహజంగా ఉండే అంచనాలే ఈ సినిమాకి ఉండటంతో తెలుగునాట కూడా మంచి క్రేజ్ ఏర్పడింది సినిమాకి.
అందుకే తెలుగులో బిజినెస్ భారి ఎత్తున జరిగింది.
షణ్ముఖ ఫిలిమ్స్ కి చెందిన ప్రవీణ్, కేపి చౌదరి ఈ చిత్ర హక్కులని 32 కోట్లకు దక్కించుకున్నారని సమాచారం.
ఇక ఫిలీంనగర్ లో కొత్తగా వినబడుతున్న వార్తలు ఏమిటంటే, ఈ హక్కుల్లో గీతా ఆర్ట్స్ కి కూడా ఓ భాగం ఉందట.ఇది ఒకవైపు.అలా కూడా కాదు, నిర్మాత అల్లు అరవింద్ తన బినామిని ఉపయోగించి ఈ హక్కులను పూర్తిగా తీసుకున్నారని మరోవైపు జోరుగా ప్రచారం జరుగుతోంది.నిజానిజాలు ఏంటో బయటకి మాత్రం స్పష్టంగా తెలియదు.
ఈ విషయాలన్ని పక్కనపెడితే, 32 కోట్ల డీల్ లో సాటిలైట్ రైట్స్ కూడా ఉండటం విశేషం.ఇక ఈ సినిమా జులై 1న భారి ఎత్తున విడుదల కాబోతోంది.







