బుర్రిపాలెం… మహేష్ బాబు పుట్టిన ఊరు.కొత్తగా చెప్పాలంటే, మహేష్ దత్తత తీసుకున్న రెండు గ్రామాల్లో ఒకటి.
మహేష్ బుర్రిపాలెంను సందర్శించడం, కోట్లు ఖర్చుపెట్టి వరాలు ప్రకటించడం చకచకా జరిగిపోయాయి.మహేష్ చేసిన రోడ్ షోకి ప్రజలు భారి సంఖ్యలో తరలివచ్చారు.“సూపర్ స్టార్ మహేష్ బాబు జిందాబాద్” నినాదాలతో ఆ ప్రాంగణాన్ని హోరెత్తించారు.
నిజానికి ఈ పర్యటన మరింత ఆర్భాటంగా జరగాల్సింది.10,000 వేలమంది అభిమానులు, ప్రజలతో ముందు భారి బహిరంగ సభ పెట్టాలనుకున్నారట.కాని మహేష్ ని అలా చేయకుండా ఆపింది సూపర్ స్టార్ కృష్ణ అని సమాచారం.
దానికి కారణాలు లేకపోలేదు.మహేష్ తోపాటు గుంటూరు ఎంపి జయ్ గల్ల ఉండటమే ఇందుకు కారణం.
అంత ఎత్తున సభ నిర్వహిస్తే, మహేష్ సేవ చేసినట్టు కాదు, టీడిపికి ప్రచారం చేసినట్టు ఉంటుందని, దాంతో పవన్ పోటిగా, మహేష్ ని టీడిపి రంగంలోకి దింపుతోందనే సంకేతాలు వెళతాయని కృష్ణ మహేష్ తో అన్నారట.అందుకే మహేష్ ముందు అనుకున్న ప్లాన్ ని క్యాన్సిల్ చేసుకున్నాడు.
సింపుల్ గా ఇలా వెళ్ళి, అలా వచ్చేసాడు.