పంజాబ్ లో కలకలం, జాడ తెలియని 167 మంది కరోనా అనుమానితులు

ప్రపంచ దేశాలను అల్లాడించేస్తున్న కరోనా భారత్ లో కూడా తీవ్ర రూపం దాల్చుతున్న విషయం తెలిసిందే.

అయితే ఈ కరోనా నేపథ్యంలో విదేశాల నుంచి వచ్చే వారి వివరాలను ఎయిర్ పోర్ట్ లో అధికారులు నమోదు చేసుకుంటున్నారు.

విదేశాల నుంచి స్వదేశానికి వచ్చిన వారి అడ్రస్, ఇంకా ఇతర వివరాలు తీసుకొని ఎయిర్ పోర్ట్ అధికారులు ఇండ్లకు పంపుతున్నారు.ఈ క్రమంలోనే ఇటీవలే పంజాబ్ లోని లూథియానా కు వివిధ దేశాల నుంచి 196 మంది వచ్చినట్లు అధికారులు గుర్తించారు.

ఉత్తర భారత దేశంలోని పలు ఎయిర్ పోర్టుల్లోని సమాచారం ఆధారంగా వారి పేర్లు, వివరాలు సేకరించారు.వారందరినీ ఇళ్లలోనే క్వారంటైన్ చేయాలని, కరోనా లక్షణాలు ఉన్నవాళ్లను హస్పిటళ్లలోని ఐసోలేషన్ వార్డులకు తరలించాలని నిర్ణయించారు.

అయితే మొత్తం 196 మందిలో కేవలం 29 మంది ఆచూకీ మాత్రమే గుర్తించగలగడం తో ఇప్పుడు అధికారుల్లో ఆందోళన మొదలైంది.మిగిలిన 167 మంది వివరాలు అన్ని కూడా ఫేక్ అని గుర్తించిన అధికారులు ఇప్పుడు రెండు బృందాలుగా మారి వారిని ట్రేస్ చేసే పనిలో పడ్డారు.

Advertisement

విదేశాల నుంచి వచ్చినవారిలో 119 మందిని ట్రేస్ చేసే బాధ్యతను పోలీసులకు, 77 మందిని గుర్తించే బాధ్యతను ఆరోగ్య శాఖకు అప్పగించినట్లు తెలుస్తుంది.పోలీసులు 12 మందిని, ఆరోగ్య శాఖ అధికారులు 17 మందిని మాత్రమే గుర్తించగలిగారని.

మిగతా 167 మంది ఆచూకీ తెలియడం లేదని అక్కడి అధికారులు వివరించారు.అయితే మిస్సింగ్ అయిన వ్యక్తుల్లో ఎవరికైనా కరోనా వైరస్ ఉంటే.

ఇతరులకు వ్యాపించే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.వారిని ట్రేస్ చేసే పని ముమ్మరంగా కొనసాగుతోందని అధికారులు తెలిపారు.

ఆ సమయంలో 32 కిలోల బరువు పెరిగాను.. సోనమ్ కపూర్ సంచలన వ్యాఖ్యలు వైరల్!

Advertisement

తాజా వార్తలు