ప్రభాస్ నాగ్ అశ్విన్ మూవీ కోసం ఏకంగా 10 మంది బాలీవుడ్ నటులు

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తో నాగ్ అశ్విన్ సైన్స్ ఫిక్షన్ మూవీ ప్లాన్ చేసిన సంగతి తెలిసిందే.

ఏకంగా 450 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ మూవీని వైజయంతీ మూవీస్ బ్యానర్ లో అశ్వినీదత్ నిర్మిస్తున్నాడు.

ఇదిలా ఉంటే ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీగా దీనిని నాగ్ అశ్విన్ ఆవిష్కరించే ప్రయత్నం చేస్తున్నారు.ప్రస్తుతం ప్రభాస్ నటిస్తున్న ఆది పురుష్, సలార్ కంప్లీట్ అయిన వెంటనే ఈ మూవీని స్టార్ట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.

డిసెంబర్ లో ఈ చిత్రాన్ని సెట్స్ పైకి తీసుకెళ్లదానికి ప్రణాళిక వేసుకుంటున్నారు.దీపికా పదుకునే ఈ మూవీలో ప్రభాస్ కి జోడీగా నటిస్తుంది.

ఇదిలా ఉంటే పాన్ ఇండియాని దాటి ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ లో తెరకెక్కబోయే ఈ మూవీకోసం హాలీవుడ్ సాంకేతిక నిపుణులు సైతం వర్క్ చేయబోతున్నారు.ఇప్పటికే ఫ్యూచర్ వరల్డ్ ని క్రియేట్ చేయడం కోసం స్టొరీ బోర్డుని నాగ్ అశ్విన్ రెడీ చేసుకుంటున్నట్లు తెలుస్తుంది.

Advertisement

ఇదిలా ఉంటే ఈ మూవీ గురించి ప్రస్తుతం మరో ఆసక్తికరమైన అప్డేట్ బయటకి వచ్చింది.సినిమాలో అమితాబచ్చన్ ఓ కీలక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే.

ఇక ఆయనతో పాటు బాలీవుడ్ స్టార్ క్యాస్టింగ్ లో పది మంది వరకు ఈ చిత్రంలో కీలక పాత్రలలో కనిపించబోతున్నట్లు తెలుస్తుంది.ఇప్పటికే వారిని ఫైనల్ చేయడం జరిగిందని సమాచారం.

అయితే వారిని సినిమా షూటింగ్ కి ముందు రివీల్ చేస్తే బాగుంటుందని హోల్డ్ లో పెట్టినట్లు టాక్.మరో వైపు హాలీవుడ్ నటులు కూడా సినిమాలో కీలక పాత్రలలో నటించబోతున్నారని తెలుస్తుంది.

హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ డేట్ ఎప్పుడంటే..?
Advertisement

తాజా వార్తలు