శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం మండలం అరకు భద్ర గ్రామంలో దారుణ హత్య

శ్రీకాకుళం జిల్లాలో దారుణ హత్య జరిగింది.మద్యానికి బానిసగా మారి కట్టుకొన్న భార్యను కడతేర్చాడు ఓ భర్త.

ఇచ్చాపురం మండలం అరకబద్ర గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది.గ్రామానికి చెందిన నరసింహ మధ్యానికి బానిసై భార్యను హింసిస్తూ ఉండేవాడు.

ఈ క్రమంలో డబ్బులు ఇవ్వమని భార్యని అడగగా ఆమె నిరాకరించడంతో దాడికి పాల్పడ్డాడు.తీవ్ర గాయాల పాలైన బాధితురాలు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించింది.

ఘటనపై ఇచ్చాపురం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
పెన్షన్ల విషయంలో చంద్రబాబు రాజకీయం.. : సీఎం జగన్

తాజా వార్తలు