ఈనెల 18న దేశ రాజకీయాల్లో పెను మార్పు..: తుమ్మల వ్యాఖ్యలు

బీఆర్ఎస్ నేత, మాజీమంత్రి తుమ్మల నాగేశ్వర రావు కీలక వ్యాఖ్యలు చేశారు.ఖమ్మంలో బీఆర్ఎస్ ఆవిర్భావ సభ సన్నాహక సమావేశంలో ఆయన పాల్గొన్నారు.

ఈనెల 18న దేశ రాజకీయాల్లో పెను మార్పు సంభవిస్తుందని తెలిపారు.దేశ రాజకీయాలను మలుపు తిప్పే విధంగా కేసీఆర్ అడుగులు వేస్తున్నారని పేర్కొన్నారు.

ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ కోసం పని చేయాలని బీఆర్ఎస్ కార్యకర్తలకు నేతలు సూచించారు.కేసీఆర్ చేస్తున్న అభివృద్ధిని ప్రజలు గుర్తించాల్సి అవసరం ఉందని, భారీ సంఖ్యలో పాల్గొని సభను విజయవంతం చేయాలని కోరుతున్నారు.

జిల్లాలో బీఆర్ఎస్ తొలి బహిరంగ సభ జరగనున్న సంగతి తెలిసిందే.ఈ క్రమంలో ఇప్పటికే సభ ఏర్పాట్లను మంత్రులు పరిశీలిస్తున్నారు.

Advertisement
60 ఏనుగుల ప్రాణాలు కాపాడిన ఏఐ.. వీడియో వైరల్..

తాజా వార్తలు