పుల్వామాలో ఎన్ కౌంటర్! ఇద్దరు హిజ్బుల్ ఉగ్రవాదుల హతం!

పాకిస్తాన్, ఇండియన్ మధ్య నెల రోజులుగా సరిహద్దు ప్రాంతంలో యుద్ధ వాతావరణం నెలకొని వుంది.

కాశ్మీర్ లోయలో చొరబడ్డ ఉగ్రవాదులని ఏరివేయడానికి భద్రతా దళాలు జల్లెడ పడుతున్నాయి మరో వైపు పాకిస్తాన్ కవ్వింపు చర్యలకి కూడా గట్టిగా బడ్డి చెబుతున్నారు.

ఇప్పటికే పాక్ నుంచి కరబడ్డ ఉగ్రవాదులని భద్రతా దళాలు ఎన్ కౌంటర్ లో మట్టు బెట్టాయి.అయితే మరో సారి కాశ్మీర్ లో ఉగ్ర వాదులు ఓ ఇంట్లో చొరబడి వున్నారని సమాచారం రావడంతో భద్రతా దళాలు ఎన్ కౌంటర్ మొదలెట్టాయి.

పుల్వామా ప్రాంతంలో త్రాల్ అనే ప్రాంతంలో ఉగ్ర వాదులు ఓ ఇంట్లో చొరబడి వున్నారని సమాచారంతో భద్రతా దళాలు వారిని టార్గెట్ గా ఎన్ కౌంటర్ చేసాయి.దీంతో ఉగ్ర వాదులు ఇద్దరు హతం అయ్యారు.

ఇంకా ఎన్ కౌంటర్ కొనసాగుతూ వుంది.ఇక చనిపోయిన ఉగ్ర వాదులు హిజ్బుల్ ముజాహిద్దిన్ టెర్రరిస్ట్ సంస్థకి చెందిన వారిగా తెలుస్తుంది.

Advertisement
వైరల్ వీడియో : క్యాబ్ డ్రైవర్ తో హీరో గొడవ..

తాజా వార్తలు