వివాదం కంటిన్యూ...!

మూవీ ఆర్టిస్టు అసోషియేషన్‌ అధ్యక్ష ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో ఆరోపణలు ప్రత్యారోపణలు ఎక్కువ అవుతున్నాయి.

ఇప్పటికే వ్యక్తిగత దూషణలకు దిగుతున్న నటీనటులు తమ విమర్శలకు మరింత పదును పెట్టారు.

అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తున్న రాజేంద్రప్రసాద్‌ మరియు జయసుధలే కాకుండా వారి మద్దతుదారులు సైతం తారా స్థాయిలో విమర్శలకు దిగుతున్నారు.ఈ నేపథ్యంలో మురళి మోహన్‌ మరియు నాగబాబులు వరుసగా ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు.

ఇప్పటికే పలు సార్లు నాగబాబు తీరుపై, ఆయన గతంలో మా అధ్యక్షుడిగా ఉన్న సమయంలో చేసిన కార్యక్రమాలపై మురళి మోహన్‌ విమర్శలు చేస్తూ వస్తున్నాడు.తాజాగా నాగబాబు కౌంటర్‌ ఇచ్చాడు.

గత కొన్ని రోజులుగా టాలీవుడ్‌లో ప్రముఖులు మరణిస్తూ ఉండటంతో ఏదో కీడు పట్టిందని యాగం నిర్వహించడం జరిగింది.మురళి మోహన్‌ ఆధ్వర్యంలో జరిగిన యాగంను నాగబాబు తప్పుబట్టాడు.

Advertisement

ఎంతో మంది అనారోగ్యంతో బాధపడుతున్న నటీనటులను వదిలి పెట్టి లక్షలు ఖర్చు చేసి యాగం చేయాల్సిన అవసరం ఏంటని ప్రశ్నించాడు.యాగం తనకు సంతృప్తిని కలిగించలేదు అంటూ బాహాటంగానే నాగబాబు విమర్శలు చేశాడు.

మరి ఈ విమర్శలపై మురళి మోహన్‌ ఎలా స్పందిస్తాడో చూడాలి.

Advertisement

తాజా వార్తలు