వామన్ రావు హత్య కేసులో జడ్పీ చైర్మన్ సంచలన వ్యాఖ్యలు.. ??

తెలంగాణాలో న్యాయవాది వామన్ రావు ఆయన భార్యను పట్టపగలు, నడిరోడ్దు మీద హత్య చేసిన ఘటన సంచలనం సృష్టించిందన్న విషయం తెలిసిందే.

అయితే ఈ విషయంలో నిందితులను కూడా అరెస్ట్ చేశారు పోలీసులు.

కాగా ఈ హత్య విషయంలో జడ్పీ చైర్మన్ మీడియాను ఉద్దేశిస్తూ, సంచలన వ్యాఖ్యలు చేశారు.అసలు వామన్ రావు హత్య కేసును మీడియా ఇన్వెస్టిగేషన్ చేస్తుందా పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తుందా? అని ప్రశ్నించారు.అసలు మీడియా వల్లనే ఈ హత్యవిషయం బయటకు వచ్చిందని కొందరు అనుకుంటుండగా, మధు మాటలకు కొందరు మీడియా ప్రతినిధులు అవాక్కైయ్యారట.

ఇక ఈ హత్యలో తన హస్తం ఉందని కొందరు భావిస్తున్న నేపధ్యంలో పుట్ట మధు ఇలాంటి సంచలనాత్మక వ్యాఖ్యలు చేయడం గమనార్హం.ఇకపోతే వామన రావు హత్యకు మధు మేనల్లుడు వాహనాలు, ఆయుధాలు సమకూర్చాడనే ఆరోపణలతో పోలీసులు ఆయనని అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.

ఆ విషయానికి సంబంధించి మాత్రం పుట్ట మధు స్పందించలేదట.ఇక పోలీసు విచారణ తర్వాత వెల్లడైయ్యే వాస్తవాలతో హైదరాబాద్‌లో మీడియా ముందుకు వస్తానని మధు పేర్కొన్నారు.

Advertisement
వీడియో వైరల్ : మూఢనమ్మకంతో చనిపోయిన వ్యక్తిని నీటిలో వేలాడదీసిన గ్రామ ప్రజలు.. చివరకు..?!

తాజా వార్తలు