వామన్ రావు హత్య కేసులో జడ్పీ చైర్మన్ సంచలన వ్యాఖ్యలు.. ??

తెలంగాణాలో న్యాయవాది వామన్ రావు ఆయన భార్యను పట్టపగలు, నడిరోడ్దు మీద హత్య చేసిన ఘటన సంచలనం సృష్టించిందన్న విషయం తెలిసిందే.

అయితే ఈ విషయంలో నిందితులను కూడా అరెస్ట్ చేశారు పోలీసులు.కాగా ఈ హత్య విషయంలో జడ్పీ చైర్మన్ పుట్ట మధు మీడియాను ఉద్దేశిస్తూ, సంచలన వ్యాఖ్యలు చేశారు.

అసలు వామన్ రావు హత్య కేసును మీడియా ఇన్వెస్టిగేషన్ చేస్తుందా పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తుందా? అని ప్రశ్నించారు.

అసలు మీడియా వల్లనే ఈ హత్యవిషయం బయటకు వచ్చిందని కొందరు అనుకుంటుండగా, మధు మాటలకు కొందరు మీడియా ప్రతినిధులు అవాక్కైయ్యారట.

ఇక ఈ హత్యలో తన హస్తం ఉందని కొందరు భావిస్తున్న నేపధ్యంలో పుట్ట మధు ఇలాంటి సంచలనాత్మక వ్యాఖ్యలు చేయడం గమనార్హం.

ఇకపోతే వామన రావు హత్యకు మధు మేనల్లుడు వాహనాలు, ఆయుధాలు సమకూర్చాడనే ఆరోపణలతో పోలీసులు ఆయనని అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.

ఆ విషయానికి సంబంధించి మాత్రం పుట్ట మధు స్పందించలేదట.ఇక పోలీసు విచారణ తర్వాత వెల్లడైయ్యే వాస్తవాలతో హైదరాబాద్‌లో మీడియా ముందుకు వస్తానని మధు పేర్కొన్నారు.

బీఆర్ఎస్ కు జై కొట్టారా ? ఎంపీ స్థానాలపై అంచనాలు పెరిగాయా ?