గంభీరావుపేట లో ఘనంగా వైఎస్ఆర్ వర్థంతి వేడుకలు

రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ( Congress party ) కార్యాలయం లో మండల అధ్యక్షుడు హమీద్ అద్వర్యంలో మాజీ ముఖ్యమంత్రి, పేదల పెన్నిధి,జలయజ్ఞ ప్రదాత స్వర్గీయ వైస్సార్ వర్థంతి కార్యక్రమంలో పూల మాలవేసి క్యాండిల్ వెలిగించి ఘనంగా నివాళులర్పించారు.అనంతరం హమీద్ మాట్లాడుతూవైస్సార్ ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాల వల్ల పేద బడుగు బలహీన వర్గాల ప్రజలకు మంచి జరిగింది,పేద విద్యార్థులు ఫీజ్ రీయింబర్స్ ద్వారా ఎంతో మంది ఉన్నత చదువులు చదివారు,ఆరోగ్య శ్రీ పథకం ద్వారా ఎంతో మంది కార్పొరేట్ వైద్యం సౌకర్యాలు పొందటం జరిగింది అన్నారు.

 Ysr's Death Anniversary Celebrated In Gambhiraopet , Gambhiraopet-TeluguStop.com

సంక్షేమ పథకాల సాధన కోసం ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కృషి చేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ప్రచార కార్యదర్శి ఏడ పోయిన ప్రభాకర్, గంభీరావుపేట పట్టణ శాఖ అధ్యక్షుడు పాపా గారి రాజు, మైనారిటీ నాయకులు మహమ్మద్ యాదుల, యూత్ కాంగ్రెస్ నాయకులు గణేష్, శ్రీకాంత్, అప్సర్, తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube