దేశంలో అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు లెటర్లు రాసిన సీఎం జగన్..!!

దేశంలో వ్యాక్సిన్ కొరత ఏర్పడిన విషయం తెలిసిందే.

దీంతో దేశవ్యాప్తంగా ఉన్న అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులను ఏకతాటిపై తీసుకురావడానికి ఏపీ సీఎం జగన్ అన్ని రాష్ట్రాల సీఎంల కు లెటర్ రాశారు.

కరోనా వ్యాక్సిన్ విషయంలో అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఒకే రీతిలో వ్యవహరించాలని లెటర్ లో విజ్ఞప్తి చేశారు.వ్యాక్సిన్ సరఫరాల్లో రాష్ట్రాలు సహకరించుకోవాలి అని స్పష్టం చేశారు.

వ్యాక్సిన్ ప్రక్రియ మొత్తం కేంద్రమే చేపట్టే రీతిలో అందరూ కలిసికట్టుగా ఉండాలని, ఒకే మాటపై ఉండాలని పేర్కొన్నారు.>ప్రస్తుత పరిస్థితుల బట్టి దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ కార్యక్రమం శరవేగంగా జరగకపోతే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి పరిస్థితి ఉందని హెచ్చరించారు.

మరోపక్క ఇదే తరుణంలో దేశంలో వ్యాక్సిన్ కొరత ఏర్పడటం పై స్లోగా జరగడంపై ఇటీవల దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కేంద్రంపై రివర్స్ అవ్వడం తెలిసిందే.ఇలాంటి తరుణంలో ఏపీ సీఎం జగన్ అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు లెటర్ రాయటం జాతీయ స్థాయిలో సంచలనం సృష్టిస్తోంది.

Advertisement

  .

నేటి ఎన్నికల ప్రచారం : బాబు అక్కడ .. జగన్ ఇక్కడ 
Advertisement

తాజా వార్తలు