కడప ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డి చంచల్ గూడ జైలులో అస్వస్థతకు గురయ్యారు.బీపీ పెరగడంతో ఆయనను ఉస్మానియా ఆస్పత్రికి తరలించిన జైలు సిబ్బంది వైద్య పరీక్షలు జరిపించారు.
అనంతరం తిరిగి జైలుకు తరలించారు.అయితే ఉస్మానియా వైద్యుల సూచన మేరకు మెరుగైన వైద్యం కోసం రేపు భాస్కర్ రెడ్డిని నిమ్స్ కు తరలించనున్నారు.
మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటూ భాస్కర్ రెడ్డి చంచల్ గూడ జైలులో ఉన్న సంగతి తెలిసిందే.