మే నెల 20వ తేదీన యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు అనే సంగతి తెలిసిందే.పుట్టినరోజు సందర్భంగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు ధన్యవాదాలు తెలపడంతో పాటు తాజాగా నోట్ ను వదిలారు.
తాను ఇంట్లో లేనని అందువల్లే తాను అభిమానులను కలవలేకపోయానని జూనియర్ ఎన్టీఆర్ చెప్పుకొచ్చారు.అయితే జూనియర్ ఎన్టీఆర్ ఇంట్లో లేకపోతే ఎక్కడ ఉన్నాడనే చర్చ అభిమానుల మధ్య జోరుగా జరుగుతోంది.
ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ ఐటిసి కోహినూర్ అపార్టుమెంట్ లో ఉన్నారని సమాచారం అందుతోంది.ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ తర్వాత సినిమా కొరకు మేకోవర్ అవుతున్నారని బోగట్టా.ఇలాంటి సమయంలో ఫోటోలు దిగితే ఎన్టీఆర్ కొత్త సినిమా లుక్ లీక్ అయ్యే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు.ఆ కారణం వల్లే ఎన్టీఆర్ ఫోటోలకు దూరంగా ఉన్నారని తెలుస్తోంది.
ఐటీసీ కోహినూర్ లోనే సెలబ్రిటీలు సైతం ఎన్టీఆర్ ను కలిశారని సమాచారం.
గురువారం రోజు రాత్రి జూనియర్ ఎన్టీఆర్ తన సన్నిహితులకు పార్టీ ఇచ్చారని సమాచారం అందుతోంది.
ఇప్పటికే జూనియర్ ఎన్టీఆర్ రెండు సినిమాలకు సంబంధించిన అప్ డేట్లు వచ్చాయనే సంగతి తెలిసిందే.ఈ రెండు సినిమాల అప్ డేట్లు ఎన్టీఆర్ తర్వాత ప్రాజెక్ట్ లపై అంచనాలను మరింత పెంచాయి.2023 సంవత్సరం చివరినాటికి జూనియర్ ఎన్టీఆర్ రెండు ప్రాజెక్ట్ లను పూర్తి చేయనున్నారు.
ఎన్టీఆర్ తర్వాత ప్రాజెక్ట్ లతో కూడా విజయాలను అందుకుంటే ఆయన రేంజ్ మరింత పెరుగుతుందని చెప్పవచ్చు.బుచ్చిబాబు డైరెక్షన్ లో మాత్రం ఎన్టీఆర్ ప్రాజెక్ట్ లేనట్టేనని ఎన్టీఆర్ నుంచి బుచ్చిబాబుకు ఈ మేరకు క్లారిటీ వచ్చిందని సమాచారం అందుతోంది.వరుసగా రెండు సినిమాల అప్ డేట్లు రావడంతో ఎన్టీఆర్ అభిమానులు తెగ సంతోషిస్తున్నారు.
ఎన్టీఆర్ మరెన్నో విజయాలను అందుకోవాలని ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు.