ఏపీలో రానున్న ఎన్నికల్లో మరోసారి వైసీపీనే( YCP ) విజయం సాధిస్తుందని ఆ పార్టీ నేత, డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి ( Deputy Speaker Kolagatla veerabhadraswamy )అన్నారు.ఓటమి భయంతోనే టీడీపీ పొత్తులు పెట్టుకుందన్నారు.
ఈ క్రమంలోనే ఎంతమంది కలిసి వచ్చినా వైసీపీ గెలుపును అడ్డుకోలేరని పేర్కొన్నారు.శాసనసభలో అడుగు పెడితే చాలనుకుని జనసేనాని పవన్ కల్యాణ్ ( Pawan Kalyan )ఎక్కువ సీట్లు డిమాండ్ చేయలేదని విమర్శించారు.
కాంగ్రెస్ ను గద్దె దించాలనే వైసీపీ ఏర్పడిందన్న కోలగట్ల కాంగ్రెస్, వైసీపీ ఒక్కటే ఎలా అవుతాయని ప్రశ్నించారు.