యువ గళం పేరుతో పాదయాత్ర చేస్తున్న టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వైసీపీ క్యాడర్ ను టార్గెట్ చేసుకుంటూ విమర్శలు చేస్తూనే ఉన్నారు.పాదయాత్రలో పూర్తిగా వైసిపి ప్రభుత్వ విధానాలను తప్పుపడుతూ ఆయా నియోజకవర్గాల్లో ఉన్న వైసీపీ కీలక నాయకులను విమర్శిస్తూ ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు.
అలాగే తాను పాదయాత్ర చేస్తున్న నియోజకవర్గాల్లోని వైసిపి కీలక నాయకులను టార్గెట్ చేసుకుని లోకేష్ అనేక ప్రశ్నలు సంధిస్తూ, వాటికి సమాధానాలు చెప్పాలంటూ విమర్శలు చేస్తున్నారు.
ఇదేవిధంగా చిత్తూరు జిల్లా లో పాదయాత్ర చేస్తున్న లోకేష్ ఆ జిల్లాలో కీలకంగా ఉన్న వైసిపి కీలక నాయకుడు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని టార్గెట్ చేసుకుంటూ విమర్శలు చేశారు.
అసలు పుంగనూరుకు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఏం చేశారంటూ లోకేష్ ఇటీవల నిలదీశారు.అసలు అక్కడ అభివృద్ధి చోటు చేసుకోలేదని విమర్శలు చేరు. లోకేష్ చేసిన ఈ విమర్శలపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తనయుడు ఎంపీ మిధున్ రెడ్డి స్పందించారు.
పుంగనూరు అభివృద్ధిపై ఎప్పుడైనా చర్చకు తాము చేద్దామని లోకేష్ చేస్తున్న విమర్శలను తప్పుపడుతూ మిధున్ రెడ్డి మాట్లాడారు.లోకేష్ ఇస్తానుసారంగా మాట్లాడుతున్నారని, చిన్న పెద్ద తేడా లేకుండా విమర్శలు చేస్తున్నారని, తిట్టడం కోసమే లోకేష్ పాదయాత్ర పెట్టుకున్నారని మిథున్ రెడ్డి విమర్శించారు.లోకేష్ ఇదే విధంగా మాట్లాడితే ప్రజల నుంచి గట్టిగా రియాక్షన్ వస్తుందని మిథున్ రెడ్డి హెచ్చరించారు.
ఏపీ సీఎం జగన్, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, వైసీపీ నేతలపై లోకేష్ విమర్శలు చేయడం కాదని,దమ్ముంటే అభివృద్ధి మాట్లాడాలని మిథున్ రెడ్డి లోకేష్ కు సవాల్ చేశారు.తన పార్టీ మేనిఫెస్టో పై మాట్లాడకుండా అనవసర వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు.చిత్తూరు జిల్లా అభివృద్ధికి అసలు టిడిపి ఏం చేసిందంటూ మిధున్ రెడ్డి ప్రశ్నించారు.టిడిపి అధికారంలోకి వస్తే రాష్ట్ర అభివృద్ధి , చిత్తూరు జిల్లా అభివృద్ధి కోసం ఏం చేస్తారనే అజెండాపై మాట్లాడకుండా ఈ తరహా వ్యాఖ్యలు చేయడం సరికాదంటూ లోకేష్ పై మిథున్ రెడ్డి ఫైర్ అయ్యారు.