వైసీపీ ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్ హాట్ కామెంట్స్

వైసీపీ ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్ సంచలన వ్యాఖ్యలు చేశారు.జిల్లా అధ్యక్షుడిగా ఉన్న తనకు సీఎం జగన్ ను కలిసే అవకాశం కల్పించాలని పార్టీ పెద్దలను కోరారు.

 Ycp Mlc Dokka Manikya Varaprasad Hot Comments-TeluguStop.com

ఈ మేరకు గుంటూరు జిల్లా తాడికొండలో జరిగిన వైసీపీ సామాజిక సాధికార బస్సు యాత్రలో డొక్కా మాణిక్య వరప్రసాద్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు.

తాడికొండ సమన్వయకర్తగా తనను సంప్రదించకుండానే ప్రకటించారని తెలిపారు.ఈ క్రమంలోనే పార్టీ ఆదేశాలను ధిక్కరించకుండా నియోజకవర్గానికి వెళ్లానన్నారు.

అయితే వారం రోజులకే సర్వేలు తనకు వ్యతిరేకంగా రావడంతో ఆగిపోమన్నారన్నారు.కొన్ని రోజుల తరువాత తననే పోటీ చేయాలని చెప్పిన పార్టీ అధిష్టానం సుచరితను తాడికొండ ఇంఛార్జిగా నియమించిందని వాపోయారు.

ఎవరైనా జగన్ ఆదేశాలను పాటించాల్సిందేనన్న ఆయన జగన్ ను కలిసేందుకు తనకో అవకాశం ఇవ్వాలని కోరారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube