గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో ఎమ్మెల్యే విడదల రజిని ఆధ్వర్యంలో భారీ వైసీపీ నిరసన ప్రదర్శన నిర్వహించింది.సీఎం జగన్ మోహన్ రెడ్డి పై టీడీపీ వ్యాఖ్యలను వ్యతిరేకిస్తూ ర్యాలీ చేపట్డారు.
ఎన్ ఆర్ టీ సెంటర్ లోని పార్టీ కార్యాలయం నుంచి గ్రంధాలయం సెంటర్లో ఉన్న వైయస్ రాజశేఖర రెడ్డి విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు.వైయస్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
సీఎం జగన్ను ఏకవచనంతో దూషిస్తూ టీడీపీ నేత పట్టాభి చేసిన అనుచిత వ్యాఖ్యలపై చంద్రబాబు నాయుడు క్షమాపణలు చెప్పాలని ఎమ్మెల్యే రజినీ డిమాండ్ చేశారు.