ఏపీలో ప్రతిపక్షాల తీరుపై వైసీపీ మంత్రి సీదిరి అప్పలరాజు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.ప్రతిపక్షం రకరకాల జిమ్మిక్కులు చేస్తోందన్నారు.
సీఎం జగన్ ప్రతిష్టను తగ్గించేందుకు రకరకాల వేషాలు వేస్తున్నారని ఆరోపించారు.లోకేశ్ లాంటి వ్యక్తులకు నడక చాలా మంచిదని చెప్పారు.
నడిచే దానికి ఎవరి అనుమతి అవసరం లేదని తెలిపారు.లోకేశ్ ఆరోగ్యం చేసే యాత్రకి యువగళం అనే పేరు పెట్టారని విమర్శించారు.