చంద్రబాబు, లోకేశ్ లపై వైసీపీ కుట్రలకు పాల్పడుతోందని మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ఆరోపించారు.చంద్రబాబుకు జడ్ ప్లస్ భద్రత తొలగించాలని ఎందుకు అంటున్నారని ప్రశ్నించారు.
ఈ మేరకు చేసిన సభాపతి, ఉప సభాపతి వ్యాఖ్యల ఉద్దేశం ఏంటని ప్రత్తిపాటి ప్రశ్నించారు.పోలీస్ వ్యవస్థను అడ్డు పెట్టుకుని చంద్రబాబుపై కుట్ర ప్రణాళిక చేస్తున్నారా అని నిలదీశారు.
చంద్రబాబు, లోకేశ్ కి ఏమైనా జరిగితే ప్రభుత్వానిదే బాధ్యతని తెలిపారు.ఎవరెన్ని కుట్రలు చేసినా వచ్చే ఎన్నికల్లో టీడీపీ గెలుపును అడ్డుకోలేరని వెల్లడించారు.