వైసీపీలో ఇంఛార్జుల మార్పులు జరిగిన నియోజకవర్గాలపై పార్టీ అధిష్టానం ప్రత్యేక దృష్టి పెట్టింది.ఈ మేరకు ఆ నియోజకవర్గాల నేతల మధ్య సమన్వయ బాధ్యతలను పార్టీ రీజనల్ కోఆర్డినేటర్లకు సీఎం జగన్ అప్పగించారు.
ఇందులో భాగంగా ఉమ్మడి ప్రకాశం జిల్లాపై ఎంపీ విజయసాయి రెడ్డి సమీక్ష నిర్వహించనున్నారు.ఈ మేరకు తాడేపల్లిలోని తన నివాసంలో ఉమ్మడి జిల్లా ముఖ్య నేతలతో సమావేశం ఏర్పాటు చేయనున్నారు.
సంతనూతలపాడు, వేమూరుతో పాటు కొండేపి నియోజసకవర్గాలపై విజయసాయి రెడ్డి సమీక్ష చేయనున్నారు.గత అభ్యర్థులు, నియోజకవర్గాల కీలక నేతలతో చర్చలు జరపనున్నారని సమాచారం.