ఏపీలో ఇన్ పుట్ సబ్సిడీ నిధులు( Input Subsidy Funds ) విడుదల అయ్యాయి.ఈ మేరకు సబ్సిడీ నగదును రైతుల ఖాతాల్లోకి సీఎం జగన్( CM Jagan ) జమ చేశారు.
ఈ సందర్భంగా తమది రైతు పక్షపాతి ప్రభుత్వమని పేర్కొన్నారు.రాష్ట్రంలోని ఏ రైతు నష్టపోకూడదన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమని సీఎం జగన్ తెలిపారు.
ఏ పంట నష్టం జరిగినా అత్యంత పారదర్శకంగా పరిహారం అందజేస్తున్నామన్నారు.
రైతులకు ( Farmers ) సరైన సమయంలో సహాయం అందిస్తున్నామని తెలిపారు.అవినీతి లేకుండా పథకాలు అందిస్తున్నామన్న సీఎం జగన్ గతంలో అందరు రైతులకు బీమా వచ్చేది కాదని చెప్పారు.గతంలో రంగు మారిన ధాన్యాన్ని కొనుగోలు చేయని పరిస్థితి ఉండేదన్నారు.
కానీ వైసీపీ( YCP ) అధికారంలోకి వచ్చిన తరువాత రంగు మారిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేస్తున్నామని తెలిపారు.