త్వరలో ఎన్నికలు రానున్న నేపథ్యంలో ఏపీలో వైసీపీ( YCP )మరోసారి అధికారంలోకి రావడమే లక్ష్యంగా అడుగులు వేస్తోంది.ఇప్పటికే అభ్యర్థుల జాబితాను ప్రకటించిన ఆ పార్టీ అధినేత, సీఎం జగన్( CM Jagan ) తాజాగా ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించనున్నారు.

ఇందులో భాగంగా వైఎస్ఆర్ జిల్లాలోని ఇడుపులపాయ నుంచి శ్రీకాకుళం జిల్లా( Srikakulam )లోని ఇచ్చాపురం వరకు ‘మేమంతా సిద్ధం’ పేరుతో బస్సు యాత్ర చేయనున్నారు.కాగా దాదాపు 21 రోజుల పాటు జరిగే ఈ బస్సు యాత్రను ఈ నెల 26న లేదా 27 వ తేదీన ప్రారంభించే అవకాశం ఉందని తెలుస్తోంది.ఈ మేరకు సీఎం జగన్ బస్సు యాత్రపై వైసీపీ రేపు అధికారిక ప్రకటన చేయనుంది.







