యనమాలకు ఆ కీలక పదవి దక్కబోతోందా ...?

ఏపీలో హోరాహోరీగా జరగనున్న ఎన్నికల్లో విజయం సాధించేందుకు అన్ని పార్టీలు తగిన విధంగా కసరత్తు మొదలుపెట్టాయి.దీనిలో భాగంగానే ప్రజలకు అనేక హామీలు ఇస్తున్నాయి.ఇక ఈ విషయంలో టీడీపీ మరింత జాగ్రత్తగా వ్యవహరిస్తోంది.అందుకే…మేనిఫెస్టో రూపకల్పనపై దృష్టి పెట్టింది.అత్యంత కీలకమైన మేనిఫెస్టో రూపొందించేందుకు టీడీపీ సీనియర్ నేతలతో ఓ కమిటీని నియమించాలని సీఎం చంద్రబాబు నాయుడు నిర్ణయించారు.

 Yanamala Ramakrishnudu Is A Manifesto Comitee Chairmen-TeluguStop.com

రాష్ట్ర ఆర్థిక మంత్రి యనమల నేతృత్వంలో మేనిఫెస్టో కమిటీని ఏర్పాటు చేసేందుకు సిద్ధం అవుతున్నట్టు తెలుస్తోంది.ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేలోపుగా అనేక కీలక నిర్ణయాల అమలుకు ఆ పార్టీ సిద్ధమవుతున్నట్లుగా రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది.కొత్త అంశాలతో మేనిఫెస్టో ఎలా రూపకల్పన చేస్తారనే అంశంపై అందరిలోనూ … ఆశక్తి నెలకొంది.

అయితే ఎవరూ ఊహించని స్థాయిలో టీడీపీ మేనిఫెస్టో ఉంటుందని టీడీపీ ముఖ్య నేతలు వ్యాఖ్యానిస్తున్నారు.రైతులు, మహిళలు, విద్యార్థులు, యువత ఇలా ప్రతివర్గాన్ని ఆకట్టుకునేలా అంశాలను మేనిఫెస్టోలో చేర్చాలని టీడీపీ భావిస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube