మహిళను రైలు కింది తోసేసి దారుణం.. ఆపై పిల్లలతో పరారీ!

ముంబయి సమీపంలోని వసాయ్ రైల్వే స్టేషన్ లో ఓ వ్యక్తి దారుణానికి పాల్పడ్డాడు.ఆ వ్యక్తి చేసిన హృదయ విదారక ఘటనకు ఆ మహిళ ప్రాణాలు కోల్పోయింది.

 Woman Was Dragged Out Of Sleep And Pushed In Front Of A Moving Train , Maharasht-TeluguStop.com

ఈ దారుణానికి పాల్పడ్డ వ్యక్తి చనిపోయిన మహిళ భర్త అయి ఉంటాడనని పోలీసులు అనుమానిస్తున్నారు. అసలేం జరిగింది అంటే.

అది ముంబయి సమీపంలోని వసాయ్ రైల్వే స్టేషన్.అక్కడ ప్లాట్ ఫాంపై ఓ మహిళ తన పిల్లలతో కలిసి నిద్రిస్తోంది.

ఉన్నట్టుండి వచ్చిన వ్యక్తి ఆ మహిళను నిద్రలోంచి లేపి రైలు ముందు ట్రాక్ పైకి తోసేశాడు.అనంతరం పిల్లలను ఎత్తుకుని అక్కడి నుండి పారి పోయాడు.

ఈ ఘోరమైన ఘటనలో ఆ మహిల చనిపోయింది.ఈ ఘోరమంతా అక్కడే ఉన్న సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయింది.

ఆదివారం పగటి సమయం నుండి ఓ వ్యక్తి, మహిళ ఇద్దరు పిల్లలు వసాయ్ రైల్వే స్టేషన్ లోనే ఉన్నారు.ఆదివారం మధ్యాహ్నం వచ్చిన వారు ఆ రాత్రంతా అక్కడే ఉన్నారు.

స్టేషన్ లోని బల్లపైనే నిద్ర పోయారు.సోమవారం తెల్లవారు జామున నాలుగింటి సమయంలో ఆ వ్యక్తి.

ఆ మహిళను నిద్ర లేపాడు.ఆమెతో కాసేపు ఏదో మాట్లాడాడు.

అనంతరం రైలు కిందకు తోసేశాడు. రైలు కింద పడిపోయిన ఆమె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది.

అక్కడే బల్లపై నిద్రిస్తున్న ఇద్దరు పిల్లలను లేపి, వారిని లాక్కొని అక్కడి నుండి పారి పోయాడు.అయితే హత్యకు పాల్పడ్డ ఆ వ్యక్తి మృతురాలి భర్త అయి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube