ప్రపంచవ్యాప్తంగా ఆన్లైన్ మార్కెటింగ్కు డిమాండ్ పెరుగుతోంది.ఆహారం నుండి పానీయాల వరకు ప్రజలు తమకు అవసరమైనవాటిని ఆన్లైన్లో ఆర్డర్ చేస్తున్నారు.
అయితే ఆన్లైన్లో షాపింగ్ చేసేటప్పుడు మోసాలు కూడా జరుగుతున్నాయి.ఒక మహిళకు ఇలాంటి అనుభవం ఎదురయ్యింది.
ఆ వివరాలు తెలిస్తే తెగ ఆశ్చర్యపోతారు.ఆ మహిళ ఆన్లైన్లో ఫుడ్ ఆర్డర్ చేసింది.
అది రాగానే ప్యాకెట్ విప్పి లోపల చూసేసరికి ఆమెకు ప్రాణాలు పోయినంత పనయ్యింది ‘ది సన్‘ రిపోర్టు ప్రకారం, ఆ మహిళ పేరు కిమ్ కరిఖా, ఆమె వృత్తిరీత్యా ఉపాధ్యాయురాలు.తనకు ఆకలిగా అనిపించి, ప్రముఖ బ్రాండ్ నుండి ఎగ్ బర్గర్ను ఆర్డర్ చేసినట్లు ఆ మహిళ తెలిపింది.
ఆర్డర్ ఇంటికి రాగానే ఆతృతగా దానిని తినేందుకు ప్యాకెట్ విప్పి చూసింది.అయితే అది అసహ్యంగా ఉంది.
దీంతో ఆమె వాంతి చేసుకుంది.
గుడ్డులోని పసుపు భాగం బూడిద రంగులోకి మారిందని, అందులో వ్యర్థాలు కూడా ఉన్నాయని ఆ మహిళ చెప్పింది.ఇది చూసిన ఆ మహిళ అనారోగ్యం పాలయ్యింది.ఈ విషయాలను ఆమె సోషల్ మీడియాలో షేర్ చేసింది.ఇది కలకలం రేపింది.మహిళ ఆరోపణపై, కంపెనీ వివరణ ఇచ్చింది.
ఆ ఆహారం చెడిపోలేదని, అయితే రసాయన చర్య వల్ల గుడ్డులోని పచ్చసొన రంగు బూడిద రంగులోకి మారిందని కంపెనీ చెబుతోంది.అయితే బర్గర్ రుచి చాలా దారుణంగా ఉందని ఆ మహిళ చెబుతోంది.
కంపెనీ తనకు ప్రత్యామ్నాయ ఆహారం కూడా ఇచ్చిందని, ఆ ఆఫర్ని తిరస్కరించానని తెలిపింది.ఎందుకంటే ఆ గుడ్డు పరిస్థితి చూస్తే మళ్లీ బర్గర్ తినాలని ఎవరికీ అనిపించదని ఆమె వ్యాఖ్యానించింది.
ఇప్పుడు ఈ విషయం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.