నెల్లూరు జిల్లా కావలికి టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేరుకున్నారు.వైసీపీ నేతల వేధింపులతో ఆత్మహత్య చేసుకున్న కరుణాకర్ కుటుంబాన్ని ఆయన పరామర్శించారు.
కావలికి వచ్చిన నారా లోకేష్ కు టిడిపి శ్రేణులు ఘన స్వాగతం పలికాయి.భారీ ర్యాలీతో కావలి పట్టణం హోరెత్తింది.
ఈ సందర్భంగా స్థానికంగా ఉన్న ఓ టీ స్టాల్ వద్ద లోకేష్ టీ తాగుతూ కార్యకర్తలతో ముచ్చటించారు లోకేష్.
అనంతరం అక్కడి నుంచి కరుణాకర్ నివాసానికి చేరుకున్నారు.
నారా లోకేష్ రాకతో కావలి టిడిపిలో కొత్త ఉత్సాహం కనిపించింది.భారీగా కార్యకర్తల అభిమానులు లోకేష్ కు స్వాగతం పలికేందుకు వచ్చారు.
తెలుగుదేశం పార్టీ నినాదాలతో కావలి పట్టణం హోరెత్తింది.