పూరి కొడుకుని ఎందుకు పట్టించుకోవడం లేదు...

పూరి జగన్నాథ్ ( Puri jagannadh )డైరెక్టర్ గా తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో చాలా సినిమాలు తీశాడు.ఈయన తీసిన మొదటి సినిమా అయిన బద్రి నుంచి రీసెంట్ గా వచ్చిన లైగర్ సినిమా వరకు చాలా సినిమాలు విజయం సాధిస్తే మరి కొన్ని సినిమాలు ప్లాపులను కూడా మూటగట్టుకున్నాయి.

ఈ సమయంలో ఇప్పుడు ఈయన రామ్ ని హీరోగా పెట్టి ఇస్మార్ట్ శంకర్ కి సీక్వల్ గా డబుల్ ఇస్మార్ట్ ( Double Ismart )అనే సినిమా చేస్తున్నాడు.ఈ సినిమా కనక సక్సెస్ అయితే ఆయన బాలీవుడ్ లో స్టార్ డైరెక్టర్ గా గుర్తింపు పొందుతాడు.ఇక ఇదే క్రమంలో చాలామంది నెటిజన్లు సైతం ఆయన్ని విమర్శిస్తూ కొన్ని కామెంట్స్ చేస్తున్నారు.

ఏంటంటే ఇప్పటికే తన కొడుకు హీరోగా చేస్తూ వరుస ఫ్లాపులను మూట గట్టుకుంటుంటే పూరి జగన్నాథ్ మాత్రం తన కొడుకుని పట్టించుకోకుండా వేరే హీరోలతో సినిమాలు చేస్తూ బిజీగా ఉంటున్నాడు తన కొడుక్కి ఒక హిట్ ఇచ్చి మార్కెట్లోకి వెళితే ఆయన సినిమాలు ఆయన చేసుకుంటూ ఉంటాడు కదా అని చాలామంది వాళ్ళ అభిప్రాయాన్ని అయితే తెలియజేస్తున్నారు.

మరి ఈ విషయం మీద పూరి జగన్నాధ్పూరి జగన్నాథ్ ఈ సినిమా తర్వాత ఆయన కొడుకుతో ఒక సినిమా చేయబోతున్నట్టుగా తెలుస్తుంది.దానికి సంబంధించిన కథ చర్చలు కూడా ప్రస్తుతం నడుస్తున్నాయి అయితే ఈ క్రమంలోనే డబుల్ ఇస్మార్ట్ కనక హిట్ అయితే తన కొడుకుని ప్యాన్ ఇండియా లెవెల్లో చూపిస్తూ ఒకేసారి ఆ సినిమాతో హిట్టు కొట్టే విధంగా పూరి జగన్నాధ్ తన ప్లానింగ్ లో తను ఉన్నాడు.ఇక అందులో భాగంగానే పూరి జగన్నాథ్ డబుల్ ఇస్మార్ట్( Double Ismart ) ని చాలా బాగా తీసే ప్రయత్నం చేస్తున్నాడు.

Advertisement
కెనడాలో మరోసారి ఖలిస్తాన్ మద్ధతుదారుల ర్యాలీ.. భారత అధినాయకత్వమే లక్ష్యమా..?

తాజా వార్తలు