ఫైబర్ నెట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు పీటీ వారెంట్లపై విజయవాడలోని ఏసీబీ కోర్టులో విచారణ జరుగుతుంది.కాగా ఫైబర్ నెట్ కేసులో పీటీ వారెంట్లపై ఇప్పటికే వాదనలు ముగిసిన సంగతి తెలిసిందే.
అయితే దీనిపై ఫైనల్ గా వాదనలు వినిపించాలని న్యాయమూర్తి న్యాయవాదులకు సూచించారు.ఈ క్రమంలో చంద్రబాబు తరపున పోసాని వెంకటేశ్వర్లు వాదన విపిస్తున్నారు.
సీఐడీ తరపున స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ వివేకానంద వస్తున్నట్లు న్యాయవాదులు సమాచారం ఇచ్చారు.వాదనలు పూర్తి చేస్తే ఇవాళే నిర్ణయం చెబుతానని ఏసీబీ కోర్టు న్యాయమూర్తి వెల్లడించారు.