ప్రపంచ ఆరోగ్య సంస్థ లేటెస్ట్ గా జరిపిన అంతర్జాతీయ కార్మిక సంస్థతో చేసిన అధ్యయంలో ప్రతి ఏటా లక్షలాది మంది మృతి చెందుతున్నారని వెళ్లడించింది.అయితే వీరిలో వారంలో 55 గంటల కన్నా ఎక్కువ పనిచేసే వారే రిస్క్ లో పడుతున్నారని తెలుస్తుంది.2016లో 7.45 లక్షల మంది ప్రాణాలు కోల్పోగా వారిలో 72% మంది పురుషులే ఉన్నట్టు తేలిందని అంటున్నారు.ఎక్కువ గంటలు పనిచేయడం వల్లే అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని అంతర్జాతీయ కార్మిక సంస్థతో కలిసి చేసిన అధ్యయనంలో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వెళ్లడించింది.
వారంలో 55 గంటలు దాని కన్నా ఎక్కువ గంటలు పనిచేయడం వల్ల గుండె జబ్బులు వస్తున్నట్టు తెలిపారు.2000వ సంవత్సరంతో పోల్చితే ఇది ఇప్పుడు 30 శాతం ఎక్కువైందని చెప్పారు.అదే పనిగా వర్క్ బిజీలో పడకుండా తగిన విశ్రాంతి తీసుకుంటూ వర్క్ చేయాలని సూచిస్తున్నారు.
రోజుకి ఎక్కువ గంటలు పనిచేయడం వల్ల వివిధ రకాల అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉందని వెల్లడించారు.కరోనా లాక్ డౌన్ టైం లో సాఫ్ట్ వేర్ ఎంప్లాయీస్ అందరు వర్క్ ఫ్రం హోం చేస్తున్నారు.
దీనిలో భాగంగా ఎక్కువసేపు కూర్చుని గంటల కొద్దీ పనిచేస్తున్నారు అలా చేస్తున్న వారికి ఎక్కువగా రోగాలు వచ్చే అవకాశం ఉందని అంటున్నారు.