చెవిలో గులిమికి .గుండెకి ఏంటి సంబంధం…అనుకుంటున్నారా?మన శరీరంలో ఉన్న ప్రతి అవయవం మరొక అవయవంతో అనుసంధానం అయి ఉంటుంది.మనచేతిలో ఉండే స్మార్ట్ ఫోన్ ద్వారా నేడు మనకు తెలియని విషయం అంటూ లేదు.కానీ స్మార్ట్ ఫోన్లో లభ్యం కాని కొన్ని విషయాలు పెద్దల ద్వారా,సంబంధిత వ్యక్తుల ద్వారా తెలుస్తుంటాయి.
మన శరీరం,ఆరోగ్యం గురించిన అనేక విషయాలు డాక్టర్ల ద్వారా మనం తెలుసుకుంటాం.అలాంటి కొన్ని ఆసక్తికర విషయాలు మీకోసం…
·మనం చెవిలో ఉండే గులిమి తీయడం కోసం చెవిలో ఇయర్ బడ్స్ లోపలి వరకు పోనిచ్చి తిప్పుతాం కదా.
అయితే దీంతో ప్రమాదమేనట.ఇలా చేయడం వల్ల హార్ట్ ఎటాక్లు వచ్చేందుకు అవకాశం ఉంటుందట.ఎలా అంటే.చెవిలో ఇయర్ బడ్స్ పెట్టి తిప్పినప్పుడు అందులో ఉండే ఓ ప్రత్యేకమైన నాడి వల్ల Vagal stimulation జరిగి అక్కడి నుంచి ఎలక్ట్రిక్ షాక్ గుండెకు చేరుతుందట.
దీంతో హార్ట్ ఫెయిల్యూర్, హార్ట్ ఎటాక్లు వచ్చేందుకు అవకాశం ఉంటుందట.అందుకే చెవిలో పుల్లలు,ఇయర్ బడ్స్ పెట్టకూడదని డాక్టర్లు చెప్తుంటారు.
గులిమి అదంతట అదే బయటికి పడిపోతుందట.కాబట్టి ఇకపై బడ్స్ పెట్టకండి.
· ఇప్పుడీ విషయం తెలిస్తే నిజమా అని నోరు తెరుస్తారు.అదేంటంటే.మన నిత్యం మలాన్ని విసర్జించే ద్వారం కన్నా మన నోట్లోనే ఎక్కువ బాక్టీరియా, వైరస్లు ఉంటాయట తెలుసా.? అవును, ఇది నిజమే.సాక్షాత్తూ వైద్యులే ఈ విషయాన్ని చెబుతున్నారు.తెరిచిన నోరు మూసేయండి.

· గుండె ఆగితే చనిపోతారని మనం ఇప్పటి వరకు తెలుసుకుంటూ వచ్చాం కదా.అయితే ఇది నిజం కాదు.ఎందుకంటే గుండె ఆగినా పలు ప్రత్యేకమైన ట్రీట్మెంట్స్ ఇస్తే వెంటనే బతుకుతారట.పైన చిత్రంలో ఇచ్చిన మహిళకు 20 నిమిషాల పాటు గుండె పనిచేయలేదట.దీంతో ఆమెకు వైద్యులు ఐసీయూలో ట్రీట్మెంట్ ఇచ్చారు.20 నిమిషాల తర్వాత ఈ మహిళ వెంటనే లేచి కూర్చుని నవ్వుతూ ఇంటికి వెళ్లిపోయిందట.అయితే ఆ సమయంలో ఆమెకు నిద్ర పోయినట్టు అనిపించిందట.
· మన నిత్యం తినే అనేక రకాల ఆహార పదార్థాల్లో మన శరీరానికి కావల్సిన కీలక విటమిన్లు, మినరల్స్ ఉంటాయని అందరికీ తెలిసిందే.
అయితే దాదాపుగా అన్ని విటమిన్లు, మినరల్స్ వెజ్ ఆహారాల్లో ఉంటాయి కానీ.కేవలం విటమిన్ బి12 మాత్రం కేవలం జంతు సంబంధ పదార్థాల్లో మాత్రమే మనకు లభిస్తుందట.
కనుక వెజ్ ప్రియులు ఈ అంశం పట్ల చింతించాల్సిందే మరి.! ఏంటీ.
విటమిన్ బి12 ఒక్కటి దొరక్కపోతే ఏం.అని సులభంగా తీసేయవద్దు.ఎందుకంటే ఈ విటమిన్ లోపించడం వల్ల మెదడు సరిగ్గా ఎదగదట.జ్ఞాపకశక్తి మందగిస్తుందట.దీనికి తోడు హార్ట్ ఫెయిల్యూర్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయట.

· విటమిన్ ఎ మనకు చాలా అవసరమని అందరికీ తెలిసిందే.దీని వల్ల శరీర రోగ నిరోధక వ్యవస్థ మెరుగు పడడమే కాదు, నేత్ర సమస్యలు పోయి దృష్టి బాగా వస్తుంది.అయితే నిజానికి ఈ విటమిన్ ఉన్న పదార్థాలను అధిక మోతాదులో తీసుకోకూడదట.
తీసుకుంటే శరీరంలో మొత్తం విషతుల్యం అయి చివరకు చనిపోతారట.ఉత్తర ధృవంలో ఉండే పౌరులు అక్కడ లభించే ఎలుగుబంటి లివర్ను తినేవారట.
అందులో విటమిన్ ఎ అధిక మోతాదులో ఉండడం వల్ల వారి శరీరాలు విషతుల్యం అయి చనిపోతున్నారట.అతి అనర్దదాయకం.
కాబట్టి ఏదీ ఎక్కువగా తినకండి.
·ఆయిల్ ఉన్న ఆహారాలను ఎక్కువగా తింటే శరీరంలో కొలెస్ట్రాల్ పెరిగి తద్వారా గుండె ఆరోగ్యం దెబ్బ తింటుందని, గుండె జబ్బులు వస్తాయని మనం ఇప్పటి వరకు చదివుకున్నాం.
కానీ అది నిజం కాదు.నిజానికి రిఫైన్డ్ పిండి, చక్కెర, ఉప్పు వంటివి ఎక్కువగా తింటేనే గుండె జబ్బులు వస్తాయని సైంటిస్టులు చెబుతున్నారు.పైగా ఆయిల్ ఫుడ్స్ను తింటే ఎక్కువ సేపు ఆకలి వేయదు,ఫలితంగా ఇలాంటి రిఫైన్డ్ పిండి పదార్థాలను ఎక్కువగా తినకుండా జాగ్రత్త పడవచ్చు.