ముఖ్యంగా చెప్పాలంటే చాలా మంది ప్రజలు తెలిసో తెలియకో చిన్న చిన్న తప్పులను చేస్తూ ఉంటారు.కానీ వాటి వల్ల పెద్ద సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది.
అందులో ముఖ్యమైనది తిన్న వెంటనే మాత్రలు వేసుకోవడం( Taking Medicine After Food ).ఇది చాలా చెడ్డ అలవాటు అని నిపుణులు చెబుతున్నారు.సరైన అవగాహన లేక ఇలా చేస్తూ ఉంటారు.ఈ ఆధునిక యుగంలో కూడా చాలా మందికి సరైన మాత్రలు తీసుకోవడం పై అవగాహన లేదు.ఇది వివిధ ఆరోగ్య ప్రమాదాలను కలిగిస్తుంది.ప్రస్తుతం చాలా మంది ప్రజలు మాత్రల దుర్వినియోగానికి గురవుతున్నారని ఒక పరిశోధనలో తెలిసింది.
అటువంటి ప్రమాదాలను సమర్ధవంతంగా తగ్గించడానికి మాత్రలు తీసుకోనే సరైన పద్ధతులను తెలుసుకోవడం ఎంతో అవసరం.అనేక వ్యాధుల నివారణ కు ఉపయోగించే మాత్రలను ఎప్పుడూ కూడా చాలా రకాలుగా కలిపి తీసుకోకూడదు.
దురదృష్టవశాత్తు కొందరు వ్యక్తులు ఒకే సమయంలో వేరు వేరు మాత్రలు తీసుకుంటూ ఉంటారు.

ఈ మాత్రల ప్రయోజనాలను పూర్తిగా గ్రహించే సామర్థ్యం శరీరం కోల్పోతుంది.సామర్థ్యాన్ని అడ్డుకుంటారో ఇది ఔషధ ప్రభావాన్ని తగ్గించడమే కాకుండా దీర్ఘకాలిక దుష్ప్రభావాలను అనుభవించే అవకాశాన్ని పెంచుతుంది.ఏదైనా రోగానికి మాత్రమే వేసుకుంటే ఇంకో మాత్ర వేసుకునే వరకు కాస్త సమయం వేచి ఉండాలి.
సాధారణంగా మనలో చాలా మందికి తగిన అవగాహన లేక ఆరోగ్య నిపుణులతో సంప్రదింపులు లేకుండా ఫార్మసీల నుంచి ఈ మందులు తీసుకునే అలవాటు ఎక్కువగా ఉంటుంది.వైద్యుల వద్దకు వెళ్లి పరీక్షలు చేయించుకుని సరైన ప్రిస్క్రిప్షన్ తో మాత్రమే మెడిసన్ తీసుకోవాలి.
ఉదాహరణకు చాలా మంది గుండె( Heart )కు సంబంధించిన సమస్యలతో బాధపడుతూ ఉంటారు.కానీ దానిని గ్యాస్ ప్రాబ్లం గా( Gas Problem ) భావించి ఆ మాత్రలు తీసుకుంటూ ఉంటారు.

ఇలాంటి చర్యలు ప్రాణాల మీదకు వస్తాయి.అలాగే మాత్రలు వేసుకునే విధానం కూడా ఎంతో ముఖ్యం.భోజనం తర్వాత వెంటనే మాత్రలు తీసుకోవడం ప్రతికూల దృశ్య ప్రభావాలను కలిగిస్తుంది.పోషకాల శోషణను నిరోధించవచ్చు.మాత్రలు తీసుకోవడానికి సరైన సమయం చూసుకోవాలి.భోజనం చేసిన వెంటనే మాత్రలు వేసుకోకూడదు.
భోజనం చేసిన 15 నుంచి 20 నిమిషాల వరకు వేసి ఉన్నప్పుడు మాత్రమే వేసుకోవాలి.







