మహీంద్రా అండ్ మహీంద్రా( Mahindra and Mahindra ) భారతదేశంలో టాప్ ఆటోమొబైల్ కంపెనీగా రాణిస్తోంది.దీనిని 1945లో ఆనంద్ మహీంద్రా( Anand Mahindra ) బంధువులైన కైలాష్ చంద్ర మహీంద్రా, జగదీష్ చంద్ర మహీంద్రా, మాలిక్ గులాం ముహమ్మద్ కలిసి స్థాపించారు.
మహీంద్రా గ్రూప్ ప్రస్తుత ఛైర్మన్ ఆనంద్ జగదీష్ చంద్ర మహీంద్రాకి మనవడు అవుతాడు.ఈ కంపెనీ మొదట లూథియానాలో ఒక స్టీల్ ట్రేడింగ్ కంపెనీగా ప్రారంభించబడింది, కానీ కొద్ది నెలల తర్వాత విల్లీస్ జీపులను తయారు చేయడం ప్రారంభించింది.
1947లో భారతదేశం స్వాతంత్ర్యం పొందినప్పుడు, ఈ కంపెనీ రెండు సంస్థలుగా విభజించబడింది.అప్పుడు మాలిక్ గులాం కంపెనీలో తనకు రావాల్సిన వాటా తీసుకొని పాకిస్థాన్ కి వలస వెళ్ళిపోయాడు.
మహమ్మద్ 1946-47 వరకు మాత్రమే మహీంద్రా అండ్ మహీంద్రాలో పనిచేశాడు.ఆ తర్వాత, ఆర్థిక మంత్రి లియాఖత్ అలీ ఖాన్ ఆధ్వర్యంలో ఆర్థిక మంత్రిత్వ శాఖలో క్యాబినెట్ కార్యదర్శిగా చేరాడు.
భారతదేశ మొదటి యూనియన్ బడ్జెట్ను రూపొందించడంలో, సిద్ధం చేయడంలో ఖాన్కు సహాయం చేశాడు.

మాలిక్ గులాం మహమ్మద్( Malik Ghulam Muhammad ) 1947లో భారతదేశ విభజన తర్వాత పాకిస్తాన్ పౌరసత్వం పొంది లాహోర్లో స్థిరపడ్డాడు.ఆయనను పాకిస్థాన్ ప్రధాని లియాఖత్ అలీ ఖాన్ మొదటి ఆర్థిక మంత్రిగా( Finance Minister ) నియమించారు.మరోవైపు 1948లో భారతదేశంలో వారు స్థాపించిన కంపెనీ మహీంద్రా అండ్ మహీంద్రాగా మారిపోయింది.
ఎమ్ అండ్ ఎమ్ భారతదేశంలో అతిపెద్ద ఆటోమొబైల్ తయారీదారుగా మారింది.ప్రస్తుతం ట్రక్లు, బస్సులు, కార్లు, వ్యవసాయ వాహనాలను తయారు చేస్తుంది.

మాలిక్ గులాం ముహమ్మద్ పాకిస్థాన్ మొదటి ఆర్థిక మంత్రిగానే కాకుండా యుద్ధ సమయంలో బ్రిటీష్ ప్రభుత్వానికి సేవలను అందించాడు.భోపాల్ రాష్ట్ర నవాబ్ హమీదుల్లా ఖాన్, హైదరాబాద్ నిజాంకు అడ్వైజర్గా విధులు నిర్వర్తించాడు.ఎమ్ అండ్ ఎమ్ ఒక విజయవంతమైన కంపెనీగా భారతదేశంలో ఆటోమొబైల్ పరిశ్రమలో కీలక పాత్ర పోషించింది.కంపెనీ తన ఉత్పత్తుల నాణ్యత, దాని కస్టమర్ సేవాకు పేరుగాంచింది.