కామ్రేడ్లు మూడు దశాబ్దాల పాటు పరిపాలించిన వెస్ట్ బెంగాల్లో మమతా బెనర్జీని మళ్ళీ ముఖ్యమంత్రిగా ఎందుకు చేశారు? ఆమె గెలుపుకు కారణాలు ఏమిటి? జాతీయ స్థాయిలో సంచలనం కలిగించిన శారదా చిట్ ఫండ్ కుంభకోణం జరిగినా, టీఎంసీ నాయకులు అరెస్టు అయినా, అరాచకాలకు బెంగాల్ నిలయంగా మారిందని విమర్శలు వెల్లువెత్తినా మళ్ళీ మమతనే ఎందుకు గెలిపించారు? ఈ గెలుపును ఒక్కొక్కరు ఒక్కో విధంగా విశ్లేషిస్తున్నారు.
ఎక్కువ మంది చెప్పే అభిప్రాయం మమత మచ్చ లేని నాయకురాలని.
ఆమె మీద ఇప్పటివరకు ఒక్క అవినీతి ఆరోపణ కూడా లేదు.ఇది ఆమెకు ప్లస్ పాయింటు అయిందని చెబుతున్నారు.
ఆమెకు డబ్బు సంపాదన మీద అసలు ఆశ లేదు.చాలా నిరాడంబరంగా జీవిస్తారు.
తక్కువ ధరల కాటన్ చీరలు కట్టుకుంటారు.హవాయి చెప్పులు వేసుకుంటారు.
సింపుల్ ఫుడ్ తింటారు.ప్రజల్లో మమేకమై పోతారు.
ముఖ్య మంత్రిని అనే గర్వం ప్రదర్శించారు.ఏ విషయంలోనైనా ధైర్యంగా నిర్ణయాలు తీసుకుంటారు.
రాష్ట్ర ప్రయోజనాల తరువాతే ఆమెకు ఏదైనా.