సౌందర్య… తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఒక వెలుగు వెలిగిన తార జువ్వ.కోట్ల మంది అభిమానులను సంపాదించుకొని ఎవరికి మాట అయినా చెప్పకుండా ఈ లోకాన్ని విడిచి పెట్టి వెళ్ళిపోయింది.
ఆమె చనిపోయి కూడా ఇప్పటికి దాదాపు 18 ఏళ్ళు అయినప్పటికి ఆమె గురించి ఇప్పటికి ఎదో ఒక వార్త వస్తూనే ఉంటుంది.ఆమెను అభిమానించే వారు ఆమె మరణాన్ని ఇప్పటికి జీర్ణించుకోవడం లేదు.
అసలు జీవితంలో ఏమి చూడకుండానే కేవలం పెళ్లయిన కొన్ని రోజులకే మూడు నెలల గర్భవతి గా ఉన్న ఆమె ఇలా ఫ్లైట్ ప్రమాదం లో మరణిస్తారని ఎవరు ఊహించలేదు.
కానీ విధి చాల బలమైనది.
ఆమె తండ్రి సౌందర్య జాతకం పుట్టినప్పుడే రాసారు.ఆమె ఇలా స్టార్ డం సంపాదించుకొని అర్దాయుష్షు తో కన్ను మూస్తుందని అయన ఏనాడో చెప్పారట.
ఇక మన తల రాతను ఎవరు తప్పిస్తారు చెప్పండి.ఆమె తండ్రి వాక్కు ప్రకారం కేవలం 31 ఏళ్లకే కన్ను మూసింది.
ఇక సౌందర్య మరణానికి ముందే కొన్ని ప్రమాద సూచనలు కూడా జరగడం నిజమా గా విధి వైపరీత్యం అని చెప్పవచ్చు.కానీ విధిని మనం తప్పించలేం కదా.ఆమె సరిగ్గా వారానికి చనిపోతుంది అనగా ఒక సంఘటన జరిగింది.ఆమె చివరగా నటించిన శంకర్ చిత్ర షూటింగ్ జరుగుతుంది.
దానికి సంబందించిన హాస్పిటల్ సెట్ అన్నపూర్ణ స్టూడియో లో వేశారు.
ఆమె షూటింగ్ లో కూర్చొని ఉండగా పై నుంచి సెట్ మొత్తం విరిగిపోయి ఆమె కూర్చున్న స్థలం లో నే పడింది.లక్కీ గా ఒక్క క్షణం ముందు ఆమె విరిగి పడుతున్న శబ్దానికి పక్కకు తప్పుకోవడం తో ఆ రోజు ప్రమాదం నుంచి బయట పడింది.ఇక ఆ తర్వాత ఆమె కరీం నగర్ బీజేపీ మీటింగ్ కోసం సెంట్రల్ వారు ఆమె కోసం ఒక ప్లేన్ ని ఏర్పాటు చేయగా, ఒక రోజు ముందే టెక్నీకల్ ప్రొబ్లెమ్స్ వల్ల ఆ విమానం మొరాయించింది.
ఆమె విమానం పాడయ్యింది అని తెలిసి ప్రోగ్రాం క్యాన్సిల్ చేసుకుని ఉంటె ఖచ్చితంగా prana గండం నుంచి కూడా బయట పడేది.కానీ ఇచ్చిన మాట కోసం సౌందర్య అన్న తన స్నేహితుడి ప్లేన్ తెప్పించడం మీటింగ్ కి రావడం కోసం ఆమె అది ఎక్కడం, అది కూలి ఆమె మరణించడం అన్ని జరిగిపోయాయి.
ఇలా వరస ప్రమాద సూచనలు ఆమెను వారం ముందు నుంచి వెంటాడుతూ వచ్చాయి.