మహబూబాబాద్ జిల్లా పాలకుర్తి నియోజకవర్గం తొర్రూరు మండలం నాంచారి మడూరు గ్రామంలో నాంచారి మడూరు, గుడి బండ తండా ల గ్రామాలకు మంజూరైన కొత్త పెన్షన్లు పంపిణీ చేసిన రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ మంచి నీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గారు అలాగే ఈ రోజు ఉదయం నుండి సాయంత్రం దాకా పాలకుర్తి నియోజకవర్గం తొర్రూరు మండల వ్యాప్తంగా అన్ని గ్రామాల లబ్ధిదారులకు కొత్త పెన్షన్లు పంపిణీ చేస్తున్న మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుఈ సందర్భంగా ఆ రెండు గ్రామాల ప్రజలు పూలు చల్లుతూ, మేళ తాళాలతో, కోలాటాల తో, బతుకమ్మలతో మంత్రి ఎర్రబెల్లి కి ఘనంగా స్వాగతం పలికారు.
మంత్రి ఎర్రబెల్లి కామెంట్స్ మన సీఎం కెసిఆర్ నేతృత్వంలో దేశంలో ఎక్కడా లేని విధంగా అభివృద్ధి, సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారు మన రాష్ట్రంలో అమలు అవుతున్న పథకాలు దేశంలో ఎక్కడా లేవు ఆసరా పెన్షన్లు దాదాపు అర కోటి మందికి ఇస్తున్నాం దేశంలో పెన్షన్లు వృద్ధులకు, దివ్యాంగులకు మాత్రమే ఇస్తున్నారు కానీ, మన రాష్ట్రంలో బీడీ కార్మికులకు, వితంతువులకు, hiv, బోదకాలు బాధితులకు, తాజాగా డయాలిసిస్ పేషెంట్లకు కూడా పెన్షన్లు ఇస్తున్న మహానుభావుడు కెసిఆర్ పెన్షన్ల వయో పరిమితిని 57 ఏండ్ల కు తగ్గించి ఇస్తున్నారు మనమంతా సీఎం కెసిఆర్ గారికి రుణపడి ఉండాలి ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారులు, ప్రజలు, లబ్ధిదారులు పాల్గొన్నారు.