సూర్యాపేట జిల్లా:జిల్లాలో గ్రామీణ ప్రాంతంలో మంచినీటి ఎద్దడి నివారణకు చర్యలు చేపట్టడంలో అధికారులు ఘోరంగా విఫలమయ్యారని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం సూర్యాపేట జిల్లా ప్రధాన కార్యదర్శి మట్టిపల్లి సైదులు( Mattipally Saidus ) ఒక ప్రకటనలో ఆరోపించారు.గ్రామీణ ప్రాంతంలో త్రాగునీరు లేక పేదలు తీవ్ర ఇబ్బందులు పడుతూ మైళ్ళ దూరం మంచినీళ్ల కోసం పోతున్నా అధికారులు,ప్రజా ప్రతినిధులు పట్టించుకునే నాధుడే లేడని ఆవేదన వ్యక్తం చేశారు.
గ్రామ పంచాయితీ పాలకవర్గం పదవి విరమణ చేసిన తర్వాత నూతన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక అధికారులకు బాధ్యతలు అప్పజెప్పిందని,గ్రామాల్లో ప్రతిరోజు అందుబాటులో ఉంటూ ప్రజల తాగునీటి కష్టాలను పట్టించుకోవల్సిన గ్రామ పంచాయతీ కార్యదర్శులు,ప్రత్యేక అధికారులు సక్రమంగా విధులకు హజరు కావడం లేదని,దీని మూలంగా గ్రామాల్లో తాగునీటి సమస్య తీవ్రంగా ఏర్పడుతుందన్నారు.