కరోనా రక్కసి మరలా తిరగబడింది.ఈ నేపథ్యంలో కేంద్రం ముందు జాగ్రత్త చర్యలకు సిద్ధమైంది.
అందుకే, ఈసారి ప్రజలు బూస్టర్ డోస్తో సహా అన్ని వ్యాక్సిన్లను తీసుకోవాలని సూచిస్తున్నారు.ఈ క్రమంలోనే భారతదేశంలో నాజల్ వ్యాక్సిన్ను బూస్టర్ డోస్గా ఉపయోగించడాన్ని భారత ప్రభుత్వం ఆమోదించింది.
భారత్ బయోటెక్ యొక్క ఇంట్రానాసల్ కోవిడ్ వ్యాక్సిన్ను బూస్టర్ డోస్గా కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ గ్రీన్ ఫ్లాగ్ చేసింది.ఇది ముందుగా ప్రైవేట్ ఆసుపత్రులలో GST మినహా రూ.800కి అందుబాటులో ఉంటుంది.
ఇక దీనిని 18 ఏళ్లు పైబడిన వారందరూ తీసుకోవచ్చని కేంద్ర ప్రభుత్వం తాజాగా తెలిపింది.
కోవాక్సిన్ లేదా కోవిషీల్డ్ యొక్క 2 మోతాదులను తీసుకున్న పెద్దలకు ఇది ఇవ్వబడుతుంది.దీనిని CoWIN ప్లాట్ఫారమ్ ద్వారా నాజల్ టీకా కోసం అపాయింట్మెంట్ లను బుక్ చేసుకోవచ్చు.
Bharat Biotech-ENCOVCC నుండి నాసల్ వ్యాక్సిన్ ప్రైవేట్ ఆసుపత్రులలో అందుబాటులో ఉంది.అయితే ప్రజలు ఆసుపత్రులకు వెళ్లే ముందు టీకా కోసం అపాయింట్మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది.

దీనికోసం మొదట CoWIN అధికారిక వెబ్సైట్ అయినటువంటి cowin.gov.in/ లోకి వెళ్లి, మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్తో లాగిన్ కావాలి.ఆ తరువాత OTPని నమోదు చేయాల్సి ఉంటుంది.లాగిన్ అయిన తర్వాత మీ వ్యాక్సిన్ స్థితిపై క్లిక్ చేసి, బూస్టర్ డోస్ ఎంచుకోవాలి.
తరువాత పిన్కోడ్ లేదా జిల్లా పేరు ద్వారా మీ సమీప టీకా కేంద్రాన్ని ఎంచుకుంటే సరిపోతుంది.మీ నాజల్ వ్యాక్సిన్ పొందడానికి మీ అపాయింట్మెంట్ను బుక్ అవుతుంది.
వ్యాక్సిన్ కోసం ఆసుపత్రికి వెళ్ళినప్పుడు ఈ అపాయింట్మెంట్ను చూపితే సరిపోతుంది.







